Friday, 08 December 2023 10:03:24 PM
# పల్నాడు జిల్లా ఓ బి సి మహిళ మండలి అధ్యక్షురాలు గంజర్ల ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో బీసీ ల కమిటీలు ఏర్పాటు # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన # ఐదు సంవత్సరాల లోపు చిన్నారులలో నిమోనియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి # మద్యం కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా?: పురందేశ్వరి # ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: క్రోసూరు మండల స్పెషల్ ఆఫీసర్ # పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌ # వైయస్ఆర్సీపీ నాయకుడు చింతపల్లి రవి భార్య అకాల మరణం: పరామర్శించిన జల వనరుల శాఖ మంత్రి # చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు # వైసీపీని తరిమికొడతారు:నేను సైతం నిరాహారదీక్షలో ఐటీడీపీ నాయకులు 27వ రోజు కొనసాగిన దీక్ష # మాచర్ల నియోజకవర్గం మాలల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ # వైసీపీకి పుట్టగతులుండవ్‌:సైకో పోవాలి - సైకిల్ రావాలి:నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు # శ్యామ్ మిత్రమండలి ఆధ్వర్యంలో శిఖ శాంసన్ కు ఘన సత్కారం # విద్యుత్ సమస్య కు శాస్వత పరిస్కారం: బొల్లా బ్రహ్మనాయుడు # ఏలూరు కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్:క్రైమ్ సినిమాను తలపించిన ఏలూరులో కిడ్నాప్ ఘటన # ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నల్లారి కిరణ్ మరియు బిజెపి అధ్యక్షులు దగ్గుబాటి పురందరేశ్వరిని కలిసిన.. అట్లూరి # గుడిపాడు లో జగనన్న ఆరోగ్య సురక్ష # చిలకలూరిపేట మండలం లింగుంట్ల వద్ద పిడుగుపాటు... # మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి కి చిత్రపటానికి నివాళులు అర్పించిన బొర్రా # రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి # కారంపూడిలో ఘనంగా గాంధీజయంతి వేడుకలు

రూ.7 లక్షల విలువైన సిగరెట్లు పట్టివేత

మూడు దుకాణాలపై కేసులు నమోదు చేస్తామన్న అధికారులు

Date : 16 July 2023 03:27 PM Views : 363

VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : చిలకలూరిపేట:నకిలీ సిగరెట్ల విక్రయదుకాణాలపై విజిలెన్స్‌ అధికారులు శనివారం మెరుపుదాడులు చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ కె ఈశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో సీఐ శ్రీహరిరావు, ఎస్‌ఐ రామచంద్రయ్య ఉన్నారు. పట్టణంలోని చలివేంద్ర బజార్, కోమలావిలాస్‌ బజార్లలోని పలు దుకాణాల్లో విజిలెన్స్‌బృందాలు తనిఖీలు నిర్వహించారు. బాలసుజాత జనరల్‌ స్టోర్స్, చికోటి ఎంటర్‌ ప్రైజేస్, సాయి ట్రేడర్స్‌లలో విదేశీ సిగరెట్లతో పాటు నకిలీబ్రాండ్ల సిగరెట్లను విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. మొత్తం 40 బండిల్స్‌ ఉన్న నకిలీ సిగరెట్లను స్వాధీనం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సిగరెట్లలో ఐటీసీ బ్రాండ్ల పోలిన సిగరెట్లు ఉండటం విశేషం. మూడు దుకాణాల యజమానులతో పాటు వాటిని సరఫరా చేసిన వరగాని ప్రాంతానికి చెందిన సుధకర్‌పై కూడా అధికారులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ కె ఈశ్వరరావు మాట్లాడుతూ పట్టణంలో నకిలీ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయని వచ్చిన సమాచారంతో ఈ దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. ఐటీసీ ట్రేడ్‌మార్కుతో ఇండియా అంతటా విక్రయించే బ్రాండెడ్‌ సిగరెట్లను ఫేక్‌ ట్రేడ్‌ మార్కులను ముద్రించి విక్రయిన్నట్లు తెలిపారు.

ఒరిజనల్, నకిలీలపై కలిపి ఐటీసీ ఫేక్‌ ట్రేడ్‌ను ఉండటాన్ని గుర్తించి దాడులు చేసినట్లు తెలిపారు. దాడుల్లో పట్టుబడిన సిగరెట్లపై కూడా ఇవి ఉన్నాయన్నారు. క్వాలిటీ టాక్స్‌ చెల్లించి ఒక్కొక్క సిగరెట్‌ ధర రూ.15 చొప్పున విక్రయించాల్సి ఉండగా, ఇక్కడి వారు నకిలీ సిగరెట్లు తయారు చేసి రూ.1 లేదా రూ.1.25 కు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. నాసిరకం సిగరెట్లు తయారుచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలా ప్రజల్ని, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం నిర్వహించిన మూడు దుకాణాల్లో సుమారు రూ.7 లక్షల సిగరెట్లు లభించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీటిని సరఫరా చేస్తున్న సుధాకర్‌ అనే వ్యక్తికి గుట్కా కేసుల్లోనూ సంబంధాలు ఉన్నాయన్నారు. నకిలీ ఉత్పత్తుల్ని ప్రజలకు ఉపయోగించవద్దని, ఎక్కడైనా విక్రయాలు గమనించినట్లైతే విజిలెన్స్‌ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. సిగరెట్లు విక్రయిస్తున్న వారి మీద కేసులు కడుతున్నామని తెలియజేశారు. వారితో పాటు రెవెన్యూ ఆర్‌ఐ విడదల రామనాయుడు, సిబ్బంది ఉన్నారు.

Madhu

Admin

VM టుడే న్యూస్

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2023. All right Reserved.

Developed By :