Friday, 08 December 2023 09:03:54 PM
# డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన # ఐదు సంవత్సరాల లోపు చిన్నారులలో నిమోనియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి # మద్యం కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా?: పురందేశ్వరి # ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: క్రోసూరు మండల స్పెషల్ ఆఫీసర్ # పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌ # వైయస్ఆర్సీపీ నాయకుడు చింతపల్లి రవి భార్య అకాల మరణం: పరామర్శించిన జల వనరుల శాఖ మంత్రి # చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు # వైసీపీని తరిమికొడతారు:నేను సైతం నిరాహారదీక్షలో ఐటీడీపీ నాయకులు 27వ రోజు కొనసాగిన దీక్ష # మాచర్ల నియోజకవర్గం మాలల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ # వైసీపీకి పుట్టగతులుండవ్‌:సైకో పోవాలి - సైకిల్ రావాలి:నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు # శ్యామ్ మిత్రమండలి ఆధ్వర్యంలో శిఖ శాంసన్ కు ఘన సత్కారం # విద్యుత్ సమస్య కు శాస్వత పరిస్కారం: బొల్లా బ్రహ్మనాయుడు # ఏలూరు కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్:క్రైమ్ సినిమాను తలపించిన ఏలూరులో కిడ్నాప్ ఘటన # ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నల్లారి కిరణ్ మరియు బిజెపి అధ్యక్షులు దగ్గుబాటి పురందరేశ్వరిని కలిసిన.. అట్లూరి # గుడిపాడు లో జగనన్న ఆరోగ్య సురక్ష # చిలకలూరిపేట మండలం లింగుంట్ల వద్ద పిడుగుపాటు... # మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి కి చిత్రపటానికి నివాళులు అర్పించిన బొర్రా # రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి # కారంపూడిలో ఘనంగా గాంధీజయంతి వేడుకలు # విలేకరులకు స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తా : పల్నాడు జిల్లా పాత్రికేయుల అధ్యక్షుడు పివిఆర్ యాదవ్

చంద్రజూ పాలెం పిహెచ్సిలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

బెల్లంకొండ

Date : 15 August 2023 06:35 PM Views : 253

VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : 77వ స్వాతంత్ర దినోత్సవ ము సందర్భంగా పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం చండ్రాజు పాలెం పిహెచ్సిలో వైద్యాధికారి కెవి కోటేశ్వరావు జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు పోరాటాలతో త్యాగాలతో వారి వారి జీవితాలను తృణ ప్రాయంగా అర్పించి పోరాడి తెచ్చుకున్న ఈ స్వాతంత్ర దినం భావితరాలకు ప్రేరణ కావాలి అన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా బ్రిటిష్ తొత్తుల కబంధహస్తాల్లో చిక్కుకొని నలిగిపోయిన భరతమాతకు స్వేచ్ఛ వాయువులు వచ్చిన రోజు ఈ స్వాతంత్ర దినోత్సవం అన్నారు దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను భారతీయులందరూ స్మరణకు తెచ్చుకోవాలన్నారు దేశ సరిహద్దు వద్ద దేశం కోసం పోరాడుతున్న వీర జవానులకు పోలీసులకు దేశాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్న కార్మిక కర్షక నేత అన్నలకు. భారతీయులందరికీ శాంసన్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మంగళగిరి మణికుమారి మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో అమరవీరుల త్యాగాలను నేటి తరానికి తెలియజేద్దామని సౌబ్రాతృత్వ స్ఫూర్తితో దేశి ఖ్యాతిని ఇనుముడింప చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు . ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ నర్స్ రాణి ఆరోగ్య అధికారి శ్రీనివాస రావు హెల్త్ సూపర్వైజర్లు భాషా సయ్యద్ కె. బేగం మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Madhu

Admin

VM టుడే న్యూస్

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2023. All right Reserved.

Developed By :