Friday, 08 December 2023 10:31:59 PM
# పల్నాడు జిల్లా ఓ బి సి మహిళ మండలి అధ్యక్షురాలు గంజర్ల ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో బీసీ ల కమిటీలు ఏర్పాటు # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన # ఐదు సంవత్సరాల లోపు చిన్నారులలో నిమోనియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి # మద్యం కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా?: పురందేశ్వరి # ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: క్రోసూరు మండల స్పెషల్ ఆఫీసర్ # పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌ # వైయస్ఆర్సీపీ నాయకుడు చింతపల్లి రవి భార్య అకాల మరణం: పరామర్శించిన జల వనరుల శాఖ మంత్రి # చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు # వైసీపీని తరిమికొడతారు:నేను సైతం నిరాహారదీక్షలో ఐటీడీపీ నాయకులు 27వ రోజు కొనసాగిన దీక్ష # మాచర్ల నియోజకవర్గం మాలల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ # వైసీపీకి పుట్టగతులుండవ్‌:సైకో పోవాలి - సైకిల్ రావాలి:నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు # శ్యామ్ మిత్రమండలి ఆధ్వర్యంలో శిఖ శాంసన్ కు ఘన సత్కారం # విద్యుత్ సమస్య కు శాస్వత పరిస్కారం: బొల్లా బ్రహ్మనాయుడు # ఏలూరు కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్:క్రైమ్ సినిమాను తలపించిన ఏలూరులో కిడ్నాప్ ఘటన # ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నల్లారి కిరణ్ మరియు బిజెపి అధ్యక్షులు దగ్గుబాటి పురందరేశ్వరిని కలిసిన.. అట్లూరి # గుడిపాడు లో జగనన్న ఆరోగ్య సురక్ష # చిలకలూరిపేట మండలం లింగుంట్ల వద్ద పిడుగుపాటు... # మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి కి చిత్రపటానికి నివాళులు అర్పించిన బొర్రా # రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి # కారంపూడిలో ఘనంగా గాంధీజయంతి వేడుకలు

ఒకే ఒక టాబ్లెట్ తో నులిపురుగులు అంతం ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

బెల్లంకొండ

Date : 17 August 2023 04:59 PM Views : 130

VM టుడే న్యూస్ - ఆరోగ్యం / పల్నాడు జిల్లా : ఒక ఆల్బెండజోల్ మాత్ర కడుపులోని నులిపురుగులను నాశనం చేస్తుందని నులిపురుగుల మాత్రలతో పోషకాలను కాపాడుకొని ఆరోగ్యవంతులుగా ఎదగాలని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ విద్యార్థులకు సూచించారు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని గురువారం మాప్ అప్ కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బెల్లంకొండ లోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఈనెల పదవ తేదీన డి వార్మింగ్ డే సందర్భంగా ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోకుండా గైరాజరైన విద్యార్థిని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా శాంసన్ మాట్లాడుతూ నులిపురుగుల కారణంగా కిషోర్ బాలికలలో పోషకాహారం లోపించి రక్తహీనత, ఆకలి మందగించటం, నీరసం, ఆందోళన, కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు, బరువు తగ్గటం వంటి రుగ్మతలకు గురికావాల్సి వస్తుందన్నారు

నులిపురుగులను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం ద్వారా పిల్లలకు నులిపురుగుల నివారణ మందులను పంపిణీ చేసి ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తుందన్నారు బెల్లంకొండ మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో, జూనియర్ కళాశాలలో, అంగన్వాడీ కేంద్రాల్లో, కస్తూరిబా బాలికల విద్యాలయంలో, ఏపీ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఒకటి నుండి 19 ఏళ్ల మధ్య వయసున్న వారికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు నులిపురుగుల వ్యాప్తి ప్రాణాంతకమైన భారంగా మారిన దేశాల్లో మన దేశం కూడా ఉందన్న విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పటికే ప్రకటించింది అన్నారు ఈ సందర్భంగా ప్రతి విద్యార్థికి చేతుల పరిశుభ్రత పట్ల సిబ్బంది అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య అధికారి చట్టు శ్రీనివాస రావు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ సునీత సచివాలయం ఆరోగ్య కార్యకర్త మధులత ఆశా కార్యకర్తలు ఫాతిమా కామేశ్వరి మేరీ తదితరులు పాల్గొన్నారు

Madhu

Admin

VM టుడే న్యూస్

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2023. All right Reserved.

Developed By :