Friday, 08 December 2023 09:18:52 PM
# పల్నాడు జిల్లా ఓ బి సి మహిళ మండలి అధ్యక్షురాలు గంజర్ల ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో బీసీ ల కమిటీలు ఏర్పాటు # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన # ఐదు సంవత్సరాల లోపు చిన్నారులలో నిమోనియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి # మద్యం కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా?: పురందేశ్వరి # ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: క్రోసూరు మండల స్పెషల్ ఆఫీసర్ # పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌ # వైయస్ఆర్సీపీ నాయకుడు చింతపల్లి రవి భార్య అకాల మరణం: పరామర్శించిన జల వనరుల శాఖ మంత్రి # చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు # వైసీపీని తరిమికొడతారు:నేను సైతం నిరాహారదీక్షలో ఐటీడీపీ నాయకులు 27వ రోజు కొనసాగిన దీక్ష # మాచర్ల నియోజకవర్గం మాలల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ # వైసీపీకి పుట్టగతులుండవ్‌:సైకో పోవాలి - సైకిల్ రావాలి:నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు # శ్యామ్ మిత్రమండలి ఆధ్వర్యంలో శిఖ శాంసన్ కు ఘన సత్కారం # విద్యుత్ సమస్య కు శాస్వత పరిస్కారం: బొల్లా బ్రహ్మనాయుడు # ఏలూరు కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్:క్రైమ్ సినిమాను తలపించిన ఏలూరులో కిడ్నాప్ ఘటన # ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నల్లారి కిరణ్ మరియు బిజెపి అధ్యక్షులు దగ్గుబాటి పురందరేశ్వరిని కలిసిన.. అట్లూరి # గుడిపాడు లో జగనన్న ఆరోగ్య సురక్ష # చిలకలూరిపేట మండలం లింగుంట్ల వద్ద పిడుగుపాటు... # మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి కి చిత్రపటానికి నివాళులు అర్పించిన బొర్రా # రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి # కారంపూడిలో ఘనంగా గాంధీజయంతి వేడుకలు

పోలీసుల అత్యుత్సాహం:విధి నిర్వహణలో ఉన్న ఈనాడు విలేఖరి చండ్ర మల్లికార్జునరావు:ఐ న్యూస్ విలేకరి ఆలపాటి ఆంజనేయులు పై దాడి

చిలకలూరిపేట

Date : 09 September 2023 04:39 PM Views : 77

VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : చిలకలూరిపేటలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నంద్యాలలో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబును సిఐడి పోలీసులు అరెస్టు చేసి కాన్వాయ్ లో విజయవాడ తీసుకు వెళుతున్న దృశ్యాలను కవర్ చేసేందుకు చిలకలూరిపేట NRT సెంటర్లో విధినిర్వహణలో ఉన్న ఈనాడు విలేఖరి చండ్ర మల్లికార్జునరావు, ఐ న్యూస్ విలేకరి ఆలపాటి ఆంజనేయులుపై దాడి చేశారు. జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి విలేకరులపై దాడి చేశారు. ఇద్దరు విలేకరులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన నిరసిస్తూ APUWJ చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై NRT సెంటర్లో విలేకరులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎస్పీ రవిశంకర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని విలేకరులు డిమాండ్ చేశారు

పోలీసులకు వ్యతిరేక నినాదాలు చేశారు. చిలకలూరిపేట అర్బన్ సిఐ రాజేశ్వర రావు, రూరల్ సీఐ అచ్చయ్య , అర్బన్, రూరల్ ఎస్సైలు ఎన్నార్టీ సెంటర్ కు చేరుకొని విలేకరులకు సర్ది చెప్పారు. ఎస్పీ తరఫున సిఐ క్షమాపణ చెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పుల్లగూర భక్తవత్సలరావుతో పాటు పలువురు ప్రెస్ క్లబ్ సభ్యులు, విలేకరులు పాల్గొన్నారు.

Madhu

Admin

VM టుడే న్యూస్

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2023. All right Reserved.

Developed By :