VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : క్రోసూరు మండలంలో జరిగే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులందరూ విజయవంతం చేయాలని పల్నాడు జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ గుడిసె చంద్రశేఖర్ అన్నారు గురువారం ఆయన క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యాధికారులతో సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అమలు తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం క్రోసూరు లో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సర్వేను ఆయన పరిశీలించి ఆరోగ్య కార్యకర్తలకు ఆశా కార్యకర్తలకు అనేక సూచనలు సలహాలు అందజేశారు యాప్ లో అప్లోడ్ తీరును పరిశీలించారు అనంతరం గరికపాడు సచివాలయంలో జరుగుతున్న ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ను ఆయన పరిశీలించారు గరికపాడు లో అంగన్వాడీ కేంద్రం ను పరిశీలించి యాప్లను తనకి చేశారు ఈ సందర్భంగా డిప్యూటీ డి ఎం హెచ్ ఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో భాగంగా ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం నిర్వహిస్తుంది అని అన్నారు ఆరోగ్య సమస్యలకు సంబంధించి ప్రతి ఇంటిని ప్రతి వ్యక్తిని కవర్ చేయాలని ప్రతి పౌరుడు తో ఇంటరాక్ట్ అయ్యి ఆరోగ్య వివరాలను గుర్తించాలన్నారు సెప్టెంబర్ 30వ తేదీ నుండి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో నలుగురు డాక్టర్లు పాల్గొనడం జరుగుతుందన్నారు ఇందులో ఇద్దరు స్పెషలిస్ట్ వైద్యులు ఉంటారన్నారు ఇందులో భాగంగా వాలంటీర్లు రెండుసార్లు ఇంటింటి క్యాంపైన్ చేయాలి అని అన్నారు ఆరోగ్య కార్యకర్తలు సిహెచ్ఓలు ఇంటింటికి వెళ్లి క్యాంపన్లో భాగంగా ఆరోగ్యశ్రీ యాప్ ను ఫోన్లో డౌన్లోడ్ చేయించాలన్నారు ఫ్యామిలీ డాక్టర్ విధానం, 104,108, ఆరోగ్యశ్రీ సేవలు తదితర అన్ని రకాల అంశాలపై ఇంటింటి క్యాంపెయిన్ చేపట్టాలి అన్నారు అండర్ వెయిట్ అనీమియా గర్భవతులను గుర్తించాలన్నారు
క్రోసూరు మండలంలో షెడ్యూల్ డాక్టర్ రమాదేవి అక్టోబర్ నెల మూడో తేదీన అనంతవరం, నాలుగవ తేదీన గుడిపాడు, ఐదో తేదీన క్రోసూరు 2, ఆరో తేదీన పీస పాడు, ఏడవ తేదీన క్రోసూరు 3, 9వ తేదీన 88 తాళ్లూరు, పదవ తేదీన బయ్యవరం, 11 వా తేదీన ఊటుకూరు, 12 వా తేదీన అందుకూరు, 13 వ తేదీన ఆవుల వారి పాలెం, 16 వ తేదీన హసనాబాద్, 17వ తేదీన నాగవరం 18 వ తేదీన దొడ్లేరు 2, 27 వా తేదీన దొడ్లేరు 1 సచివాలయాల పరిధిలో క్రోసూరు మండలంలో జగనన్న ఆరోగ్య సురక్ష హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని ప్రజలందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని డాక్టర్ రమాదేవి కోరారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ బాల అంకమ్మ భాయ్ డాక్టర్ సిరి చందన డాక్టర్ మహమ్మద్ సాధ్ సిహెచ్ఓ సాంబశివరావు ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ సీనియర్ అసిస్టెంట్ జానీ భాష హెల్త్ సూపర్వైజర్లు శివుడు అమర జ్యోతి ఆరోగ్య కార్యకర్తలు సిహెచ్ వోలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Admin
VM టుడే న్యూస్