VM టుడే న్యూస్ - రాజకీయం / పల్నాడు జిల్లా : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ నరసరావుపేట నియోజకవర్గంలో "బాబుతో నేను" అనే నినాదంతో నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శనివారానికి 25 రోజుకు చేరాయి.నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు ఆదేశానుసారం గ్రామ,వార్డ్,మండల,పట్టణ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు,కార్యకర్తలు నిరసన తెలిపారు
సైకో పోవాలి-సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు.ఈ రిలే దీక్షల్లో నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ పాల్గొన్నారు.చంద్రబాబుకు తన మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో న్యాయవ్యవస్థ అవినీతిపరులకు అండగా నిలిచి నిజాయితీపరులను వేదిస్తున్నారన్నారు.సైకో మనస్తత్వం ఉన్న సీఎం జగన్ పైశాచిక ఆనందం కోసం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించారని ఆరోపించారు.చంద్రబాబు సభలకు భారీగా వస్తున్న జనంను చూసి జగన్ రెడ్డికి,మంత్రులకు మతి భ్రమించిందన్నారు.స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం అన్యాయమన్నారు.జైలులో ఉన్న చంద్రబాబుకు రక్షణ లేదని ఆయనను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ముందుగా దీక్షాదారులకు డా౹౹చదలవాడ అరవింద బాబు పూలమాలలు వేసి దీక్షలు ప్రారంభించగా టీడీపీ సీనియర్ నాయకులు వేములపల్లి వెంకట నరసయ్య,బొడ్డపాటి పేరయ్య,కొల్లి వెంకటేశ్వర్లు, పామిడి జగన్నాథం,కొల్లి బ్రహ్మయ్య,వాసిరెడ్డి రవి దీక్షా దారులకు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కాసా రాంబాబు,టీడీపీ నాయకులు బండరుపల్లి విశేశ్వరావు,ఇండ్లమూరి రామారావు,పునాటి శ్రీనివాస్ రావు,కడియం కోటి సుబ్బారావు,జాన్ సైదా,మన్నన్ షరీఫ్,నాగూర్, శాఖమూరి రామ్మూర్తి,అత్తలూరి సాంబశివరావు,చుక్కపల్లి చంద్రమౌళి,అల్లూరి శ్రీనివాసరావు,గాడిపార్తి సురేష్,జాగార్లమూడి హనుమాతరావు,పల్లెల నాగిరెడ్డి,అబ్బురి శ్రీనివాసరావు,గడిపార్తి నరసింహారావు,వసంత ఎల్లమంద,మేకల సైదరావు,కోవూరి బాబు,మీరవాలి,మొహమ్మద్ రఫీ,రహమాన్,మదీనా ఖాజా,తాళ్లపనేని బ్రహ్మయ్య,గాడిపార్తి పాపారావు,మాబు,నల్లపాటి చిన్న సుబ్బయ్య,బోల్లేపల్లి హనుమాతరావు,బాషా,తిరుమలరెడ్డి వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Admin
VM టుడే న్యూస్