Thursday, 17 September 2026 05:43:08 AM
# బాల్యవివాహాలను నిర్మూలించడం సమాజ బాధ్యత- అడ్వకేట్ జిజే రావు # 15 వేల రూపాయలు పింఛన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లాకు డివిఎంసి మెంబర్ . డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ విజ్ఞప్తి # భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ సంజన సింహాకు డివిఎంసి మెంబర్ డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ విజ్ఞప్తి # సత్తెనపల్లి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ విజయకేతనంలో మరో మైలురాయి # నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం

ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

క్రోసూరు

Date : 28 May 2024 08:45 PM Views : 1682

VM Today News - ఆరోగ్యం / పల్నాడు : ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రజినీ మాట్లాడుతూ పీరియడ్స్ వచ్చే ముందర తలనొప్పి, చిరాకు లేదా అలసట, పొత్తికడుపులో తిమ్మిర్లు, నడుము నొప్పి ఉంటాయన్నారు పిరియడ్స్ కు సంబంధించి అపోహలు వివరించారు

సృష్టికి మూలమైన ఋతుక్రమం పై విస్తృత చర్చ, అవగాహన అవసరమని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ పేర్కొన్నారు మంగళవారం ఋతుక్రమం ఆరోగ్యం పరిశుభ్రత దినోత్సవం పురస్కరించుకొని ఆయన పల్నాడు జిల్లా క్రోసూరు గ్రామ శివారు ఎర్రబాలెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కిశోర బాలికలకు, మహిళలకు జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడారు . యువతులతో పాటు మహిళలో ఋతుక్రమంపై అవగాహన పెంపొందించడం కోసం ఏటా మే 28న యూనిసెఫ్ ఆధ్వర్యంలో బహిష్టు పరిశుభ్రత దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు రుతుక్రమం అనేది సృష్టి కార్యమని దాన్ని సామాజిక బాధ్యతగా భావించి పరిశుభ్రతపై మహిళలు యువతలు అందరిలోనూ అవగాహన పెంపొందించినప్పుడే ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించగలమని ఆయన అన్నారు పీరియడ్స్ సమయంలో రక్తాన్ని పీల్చుకోవటానికి మెరుగైన నాణ్యమైన ప్యాడ్ ల ను ఉపయోగించాలని, పిరియడ్స్ సమయంలో శానిటరీ పాడ్స్ మార్చినప్పుడల్లా చేతులను శుభ్రం చేసుకోవాలని దీంతో ఇన్ఫెక్షన్ నూ నివారించవచ్చు అన్నారు పీరియడ్స్ సమయంలో ఏ ఉత్పత్తిని ఉపయోగించిన దానిని టాయిలెట్ పేపర్లో బాగా చుట్టి డస్ట్ బిన్ లో వేయాలన్నారు టాయిలెట్లో రుతుక్రమ ఉత్పత్తులను విసిరేయడం మానేయాలన్నారు. కౌమార దశలోని బాలికలు, యువత, తల్లులు, తండ్రులు, అబ్బాయిలు ముఖ్యమైన ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలని శాంసన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ యు .వి. రజిని, ఆరోగ్య కార్యకర్త డి. స్వప్న రాణి, ఆశా కార్యకర్తలు పార్వతి, సుస్మిత , అంగనవాడి టీచర్ మల్లిక, కిషోర్ బాలికలు, మహిళలు పాల్గొన్నారు


VM TODAY NEWS

Admin

VMToday News

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :