Tuesday, 18 February 2025 08:38:40 PM
# రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువనాయకులు కన్నా నాగరాజు # బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది # క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్ # ఆర్యవైశ్యులకు అండగా నిలిచే డా౹౹చదలవాడ అరవింద బాబుని గెలిపించుకుందాం # లోక్‌సభకు 965, అసెంబ్లీకి 5,460 నామినేషన్లు # ఎన్నికల ప్రచారంలో మాజీ మేయర్ # సమాజమే దేవాలయమనేది మన నినాదం సమాజం ఉన్నదే దోపిడీకి అనేది వైసీపీ నినాదం వైద్యుల్ని కూడా వేధించిన దుర్మార్గుడైన జగన్ రెడ్డి,గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

క్రోసూరు

Date : 28 May 2024 08:45 PM Views : 273

VM Today News - ఆరోగ్యం / పల్నాడు : ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రజినీ మాట్లాడుతూ పీరియడ్స్ వచ్చే ముందర తలనొప్పి, చిరాకు లేదా అలసట, పొత్తికడుపులో తిమ్మిర్లు, నడుము నొప్పి ఉంటాయన్నారు పిరియడ్స్ కు సంబంధించి అపోహలు వివరించారు

సృష్టికి మూలమైన ఋతుక్రమం పై విస్తృత చర్చ, అవగాహన అవసరమని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ పేర్కొన్నారు మంగళవారం ఋతుక్రమం ఆరోగ్యం పరిశుభ్రత దినోత్సవం పురస్కరించుకొని ఆయన పల్నాడు జిల్లా క్రోసూరు గ్రామ శివారు ఎర్రబాలెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కిశోర బాలికలకు, మహిళలకు జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడారు . యువతులతో పాటు మహిళలో ఋతుక్రమంపై అవగాహన పెంపొందించడం కోసం ఏటా మే 28న యూనిసెఫ్ ఆధ్వర్యంలో బహిష్టు పరిశుభ్రత దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు రుతుక్రమం అనేది సృష్టి కార్యమని దాన్ని సామాజిక బాధ్యతగా భావించి పరిశుభ్రతపై మహిళలు యువతలు అందరిలోనూ అవగాహన పెంపొందించినప్పుడే ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించగలమని ఆయన అన్నారు పీరియడ్స్ సమయంలో రక్తాన్ని పీల్చుకోవటానికి మెరుగైన నాణ్యమైన ప్యాడ్ ల ను ఉపయోగించాలని, పిరియడ్స్ సమయంలో శానిటరీ పాడ్స్ మార్చినప్పుడల్లా చేతులను శుభ్రం చేసుకోవాలని దీంతో ఇన్ఫెక్షన్ నూ నివారించవచ్చు అన్నారు పీరియడ్స్ సమయంలో ఏ ఉత్పత్తిని ఉపయోగించిన దానిని టాయిలెట్ పేపర్లో బాగా చుట్టి డస్ట్ బిన్ లో వేయాలన్నారు టాయిలెట్లో రుతుక్రమ ఉత్పత్తులను విసిరేయడం మానేయాలన్నారు. కౌమార దశలోని బాలికలు, యువత, తల్లులు, తండ్రులు, అబ్బాయిలు ముఖ్యమైన ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలని శాంసన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ యు .వి. రజిని, ఆరోగ్య కార్యకర్త డి. స్వప్న రాణి, ఆశా కార్యకర్తలు పార్వతి, సుస్మిత , అంగనవాడి టీచర్ మల్లిక, కిషోర్ బాలికలు, మహిళలు పాల్గొన్నారు


VM Today News

Admin

VMToday News

Copyright © VM Today News 2025. All right Reserved.

Developed By :