VM Today News - భక్తి / పల్నాడు : త్రికూటేశ్వర స్వామి వారికి జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర హోం మంత్రి అనిత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. మంత్రులు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు కలగాలని ప్రార్థనలు చేశారు. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అధికారులు వారికి సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనులపై చర్చించారు. భక్తులతో మంత్రులు సత్సంబాషణ జరిపారు. కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది.
Reporter
VMToday News