VM Today News - భక్తి / పల్నాడు : పల్నాడు జిల్లా అమరావతిలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. పెదకూరపాడు ఎమ్మెల్యే బాష్యం ప్రవీణ్ అమరలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల సంక్షేమంతో పాటు సీఎం నారా చంద్రబాబు నాయుడుకు స్వామివారి కృప ఉండాలని ప్రార్థించారు. భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ఆలయ అధికారులు సమగ్ర ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రాత్రి జరిగే కల్యాణం, లింగోద్భవ పూజలకు భక్తులు హాజరుకావాలని కోరారు.
Reporter
VMToday News