VM Today News - వార్తలు / పల్నాడు : మాచర్ల మండలం విజయపురి సౌత్ నాగార్జునసాగర్ ఏపీఆర్జేసీ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ కుక్కమూడి ప్రసాద్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనేషన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు గురజాల అప్పారావు గురువారం నరసరావుపేట లోని పల్నాడు జిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ వి.సంజన సిన్హా ను కలిసి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9 ఫిబ్రవరి 2026 న సుమారు రాత్రి 10 గంటల సమయంలో నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాలలో విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం రాళ్లతో దాడులు చేసుకోవడం జరిగిందని ఈ రాళ్లదాడులలో జూనియర్ ఇంటర్ మొదటి సంవత్సరం సీఈసీ చదువుతున్న ఎస్టి సుగాలి కులానికి చెందిన విద్యార్థి వెంకటేశ్వర్లు నాయక్ ఎడమ కంటికి బలమైన గాయమైనదని అతనికి గుంటూరు శంకర్ కంటి వైద్యశాలలో ఆపరేషన్ జరిగిందని ఇంకా ఆ విద్యార్థికి మూడు ఆపరేషన్లు చేయాలని డాక్టర్లు చెప్పారని అలాగే మరి కొంతమంది విద్యార్థులకు గాయాలయ్యాయని ఈ సంఘటన అంతా పత్రిక లలో రావడం జరిగిందని నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాలకు వెళ్లి సందర్శించి అక్కడున్నటువంటి కాలేజీ ప్రిన్సిపల్ నూతక్కి సరోజినీని విద్యార్థులను సంఘటన గురించి అడిగి తెలుసుకోవడం జరిగిందని వారు చెప్పిన విషయాలను బట్టి మరల ఆ కళాశాలలో విద్యార్థుల మధ్య ఏ సమయంలోనైనా దాడులు చేసుకునే అవకాశం ఉందని విద్యార్థులు మానసికంగా ఇబ్బందులు పడుతూ భయభ్రాంతులకు గురవుతున్నారని వారికి రక్షణ భద్రత తక్షణం అవసరమని, వారికి రక్షణ భద్రత కల్పించాలని గతంలో ఎప్పుడూ కూడా ఈ కాలేజీలో ఈలాంటి సంఘటనలు జరగలేదని ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ అధ్యాపకుల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఎలాంటి సంఘటనలు ఈ కాలేజీలో చోటుచేసుకున్నాయని వారిపై తగు చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలో పునరావృతం కాకుండా చూడాలని కోరుతూ పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువెళ్లారు అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆమెకు వారు అందజేశారు ఈ సమస్యపై ఆమె సానుకూలంగా స్పందించి సమస్య తలెత్తకుండా విద్యార్థులకు రక్షణ భద్రత కల్పిస్తామని ఆమె తెలియజేశారు ఈ విషయాన్ని పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు దృష్టికి తీసుకువెళ్లగా వారు సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరిస్తానని ఆయన తెలిపారు వినతి పత్రాన్ని అందజేసిన వారిలో పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ వి కోట నాయక్ సిహెచ్ లాజర్ బాబు తదితరులు ఉన్నారు
Admin
VMToday News