Monday, 02 March 2026 02:30:42 PM
# నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్

Date : 19 February 2026 07:39 PM Views : 45

VM Today News - వార్తలు / పల్నాడు : మాచర్ల మండలం విజయపురి సౌత్ నాగార్జునసాగర్ ఏపీఆర్జేసీ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ కుక్కమూడి ప్రసాద్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనేషన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు గురజాల అప్పారావు గురువారం నరసరావుపేట లోని పల్నాడు జిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ వి.సంజన సిన్హా ను కలిసి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9 ఫిబ్రవరి 2026 న సుమారు రాత్రి 10 గంటల సమయంలో నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాలలో విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం రాళ్లతో దాడులు చేసుకోవడం జరిగిందని ఈ రాళ్లదాడులలో జూనియర్ ఇంటర్ మొదటి సంవత్సరం సీఈసీ చదువుతున్న ఎస్టి సుగాలి కులానికి చెందిన విద్యార్థి వెంకటేశ్వర్లు నాయక్ ఎడమ కంటికి బలమైన గాయమైనదని అతనికి గుంటూరు శంకర్ కంటి వైద్యశాలలో ఆపరేషన్ జరిగిందని ఇంకా ఆ విద్యార్థికి మూడు ఆపరేషన్లు చేయాలని డాక్టర్లు చెప్పారని అలాగే మరి కొంతమంది విద్యార్థులకు గాయాలయ్యాయని ఈ సంఘటన అంతా పత్రిక లలో రావడం జరిగిందని నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాలకు వెళ్లి సందర్శించి అక్కడున్నటువంటి కాలేజీ ప్రిన్సిపల్ నూతక్కి సరోజినీని విద్యార్థులను సంఘటన గురించి అడిగి తెలుసుకోవడం జరిగిందని వారు చెప్పిన విషయాలను బట్టి మరల ఆ కళాశాలలో విద్యార్థుల మధ్య ఏ సమయంలోనైనా దాడులు చేసుకునే అవకాశం ఉందని విద్యార్థులు మానసికంగా ఇబ్బందులు పడుతూ భయభ్రాంతులకు గురవుతున్నారని వారికి రక్షణ భద్రత తక్షణం అవసరమని, వారికి రక్షణ భద్రత కల్పించాలని గతంలో ఎప్పుడూ కూడా ఈ కాలేజీలో ఈలాంటి సంఘటనలు జరగలేదని ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ అధ్యాపకుల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఎలాంటి సంఘటనలు ఈ కాలేజీలో చోటుచేసుకున్నాయని వారిపై తగు చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలో పునరావృతం కాకుండా చూడాలని కోరుతూ పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువెళ్లారు అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆమెకు వారు అందజేశారు ఈ సమస్యపై ఆమె సానుకూలంగా స్పందించి సమస్య తలెత్తకుండా విద్యార్థులకు రక్షణ భద్రత కల్పిస్తామని ఆమె తెలియజేశారు ఈ విషయాన్ని పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు దృష్టికి తీసుకువెళ్లగా వారు సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరిస్తానని ఆయన తెలిపారు వినతి పత్రాన్ని అందజేసిన వారిలో పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ వి కోట నాయక్ సిహెచ్ లాజర్ బాబు తదితరులు ఉన్నారు


VM TODAY NEWS

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :