Sunday, 15 September 2024 04:01:32 AM
# కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువనాయకులు కన్నా నాగరాజు # బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది # క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్ # ఆర్యవైశ్యులకు అండగా నిలిచే డా౹౹చదలవాడ అరవింద బాబుని గెలిపించుకుందాం # లోక్‌సభకు 965, అసెంబ్లీకి 5,460 నామినేషన్లు # ఎన్నికల ప్రచారంలో మాజీ మేయర్ # సమాజమే దేవాలయమనేది మన నినాదం సమాజం ఉన్నదే దోపిడీకి అనేది వైసీపీ నినాదం వైద్యుల్ని కూడా వేధించిన దుర్మార్గుడైన జగన్ రెడ్డి,గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి # ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న:బొర్రా # గోపిరెడ్డికి వణుకు పుట్టిస్తున్న టిడిపి చేరికలు: డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు జేజేలు కొడుతున్న ప్రజలు # క్రోసూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి బాల అంకమ్మ బాయ్ ఆధ్వర్యంలో మలేరియా పై అవగాహన సదస్సు # మానవ హక్కుల ప్రదాత బి.ఆర్ అంబేద్కర్: APGEA క్రోసూరు యూనిట్ అధ్యక్షులు శిఖా శాంసన్ # ప్రజలకు జవాబుదారితనంగా సేవలు అందించాల్సిన ప్రభుత్వ శాఖలోనే: ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి భారీ మొత్తంలో ముడుపులు!! # పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి భద్రత: వైద్యాధికారిణి బాల అంకమ్మ భాయ్

కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి

లేబర్ ఆఫీసర్ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ సేఫ్టీ మరియు పొల్యూషన్ బోర్డ్ అధికారులు సున్నపు పరిశ్రమల తనిఖీ నిర్వహించాలి: పిడిఎం, ఎం సి పి ఐ

Date : 31 August 2024 02:03 PM Views : 68

VM Today News - వార్తలు / పల్నాడు : కార్మిక హక్కులను, చట్టాలను హరిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు కార్మిక సంఘాల నాయకులు పిడుగురాళ్ల సున్నపు బట్టీల సెంటర్లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పిడిఎం రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ లైమ్ స్టోన్ సిటీగా పేరుగాంచిన పల్నాడు జిల్లా, పిడుగురాళ్ల సున్నపు పరిశ్రమల నుండి నిత్యం కొన్ని వందల టన్నుల సున్నం దేశవ్యాప్తంగా ఉన్న పరిశ్రమలకు ,పేపర్ మిల్లులకు, చేపల ఎరువు ,బ్రిక్ తయారీ కంపెనీలకు, ఎగుమతి చేయబడుతుంది. అలాంటి పేరుగాంచిన సున్నపు పరిశ్రమలో నిత్యం సున్నం తయారీలో రాత్రిం భవళ్ళు వెట్టి చాకిరికి గురవుతూ ప్రమాదపు అంచుల్లో జీవనం కొనసాగిస్తున్నారు కార్మికులకు యాజమాన్యాలు ఎటువంటి రక్షణ చర్యలను, భద్రతను, మౌలిక వసతులను కల్పించకుండా వారిని మృత్యు కుహరం లోనికి నెడుతున్నారు. సున్నపు బట్టీల కార్మికులు ఏళ్ల తరబడి ఎటువంటి గుర్తింపు లేకుండా సున్నపు తయారీకి అవసరమైనటువంటి రాయి,బొగ్గు కొడుతూ రెక్కల ముక్కలు చేసుకున్నా కనీసం మూడు పూటలా తిండికి కూడా సరిపోవడంలేదని కార్మికులు వాపోతున్నారు.బయట ఉపాధి లేక ఎటు పోలేక పూట గడుపుకోవడానికి యాజమాన్యం పెట్టే ఇబ్బందులకు గుండె రాయి చేసుకుని బతుకుతున్నారు మానవత్వం మరిచిన పెట్టుబడిదారులు బలవంతంగా 12 గంటలు వెట్టి చాకిరి చేయించుకొని కేవలం నెలకు 4000 జీతం ఇచ్చి కార్మికుల కష్టాన్ని అత్యంత దారుణంగా దోచుకుంటున్నారు.ఉదయం నుంచి సాయంత్రం వరకు మొద్దు కష్టం చేయించుకొని పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా కార్మికులను మోసం చేసి లాభాలు ఘడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక శాఖ స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించని ఎడల రాబోవు రోజుల్లో పల్నాడు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కార్మిక సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకు వెళతామన్నారు. అనంతరం ఎం సిపిఐ జిల్లా అధ్యక్షులు ఓర్సు కృష్ణ మాట్లాడుతూ కనీసం విధుల్లో ఉన్నప్పుడు కార్మికులు అవసరమైన దుస్తులు ,షూస్, కళ్ళజోళ్ళు, హెల్మెట్, కొబ్బరి నూనె, బెల్లం ,లాంటి సరుకులు కూడా యాజమాన్యం ఇవ్వడం లేదు అంటే సిగ్గుచేటు, సున్నపు బట్టీలపై సంబంధిత లేబర్ ఆఫీసర్లు ఉన్నతాధికారులు తరచూ సున్నపు పరిశ్రమలు కల్పిస్తున్న భద్రతా ప్రమాణాలను,రక్షణ చర్యలను,తనిఖీ చేస్తూ ఉండాలి కానీ అటువంటివి ఏమీ లేకుండా కార్మికులను మరింత బానిసలుగా మార్చి వారి హక్కులను హరిస్తూ యాజమాన్యాలకు సేవ చేస్తున్నారు.ఇకనైనా సున్నపు పరిశ్రమ కార్మిక సమస్యలపై ప్రభుత్వం దృష్టి సాధించాలి, శ్రమ దోపిడీ బలవంతపు శ్రమను అరికట్టి వారికి అవసరమైన సేఫ్టీ పరికరాలు, పనికి తగిన జీతం, పిఎఫ్, ఇఎస్ఐ అమలు చేయాలి ,అలాగే పొల్యూషన్ నియంత్రణకై చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పిడిఎం రాష్ట్ర అధ్యక్షులు కే శ్రీనివాసరావు, సెంటర్ ట్రేడ్ యూనియన్ నాయకులు కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.


VM Today News

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2024. All right Reserved.

Developed By :