VM Today News - భక్తి / పల్నాడు : సత్తెనపల్లి: స్థానిక పట్టణంలో 22వ వార్డు నాగన్నకుంటలో వేంచేసియున్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానం 12వ వార్షికోత్సవ సందర్భంగా రెండోవ రోజైన శుక్రవారం నాడు ఉదయం శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారికి నవనీత రూప అలంకరణ శ్రీ కార్య సిద్ధి ఆంజనేయ స్వామి వారు భక్తులకు దర్శనం అందించారు. అనంతరం అయ్యప్ప కోలాట బృందం వారిచే నృత్య ప్రదర్శనలు జరిపించారు. ఈ అలంకరణ కార్యక్రమంలో కార్యక్రమంలో మహిళలు విరివిగా పాల్గొనడం విశేషం అని ఆలయ అర్చకులు వేదాంతం రమణాచార్యులు వెల్లడించారు. ఈ పూజా కార్యక్రమంలో సుమారు 300 మంది పాల్గొన్నట్లు తెలిపారు. అనంతరం పూజలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు.
Admin
VMToday News