VM Today News - బ్రేకింగ్ న్యూస్ / పల్నాడు : నూజెండ్ల మండలం పాత ఉప్పలపాడు గ్రామ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడి 108 అంబులెన్స్ ద్వారా పట్టణ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించబడ్డారు. రోడ్డు ప్రమాదానికి గురైన ఇద్దరు మూలకలూరు గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. మృతి చెందిన వ్యక్తి శ్యామ్ సోన్ (28). మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. తీవ్ర గాయాలైన మరో వ్యక్తిని ప్రైవేట్ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. పండగ రోజే ఇలాంటి దుర్ఘటన కుటుంబంలో విషాదం తీసుకువచ్చింది.
Reporter
VMToday News