Thursday, 16 May 2024 12:15:43 PM
# ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువనాయకులు కన్నా నాగరాజు # బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది # క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్ # ఆర్యవైశ్యులకు అండగా నిలిచే డా౹౹చదలవాడ అరవింద బాబుని గెలిపించుకుందాం # లోక్‌సభకు 965, అసెంబ్లీకి 5,460 నామినేషన్లు # ఎన్నికల ప్రచారంలో మాజీ మేయర్ # సమాజమే దేవాలయమనేది మన నినాదం సమాజం ఉన్నదే దోపిడీకి అనేది వైసీపీ నినాదం వైద్యుల్ని కూడా వేధించిన దుర్మార్గుడైన జగన్ రెడ్డి,గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి # ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న:బొర్రా # గోపిరెడ్డికి వణుకు పుట్టిస్తున్న టిడిపి చేరికలు: డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు జేజేలు కొడుతున్న ప్రజలు # క్రోసూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి బాల అంకమ్మ బాయ్ ఆధ్వర్యంలో మలేరియా పై అవగాహన సదస్సు # మానవ హక్కుల ప్రదాత బి.ఆర్ అంబేద్కర్: APGEA క్రోసూరు యూనిట్ అధ్యక్షులు శిఖా శాంసన్ # ప్రజలకు జవాబుదారితనంగా సేవలు అందించాల్సిన ప్రభుత్వ శాఖలోనే: ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి భారీ మొత్తంలో ముడుపులు!! # పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి భద్రత: వైద్యాధికారిణి బాల అంకమ్మ భాయ్ # ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వేసవికాలంలో జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి: ఆరోగ్య విస్తరణ అధికారి # క్షయ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # రంజాన్ నెల శుభాకాంక్షలు: శ్యామ్ మిత్రమండలి అధ్యక్షులు శిఖా శాంసన్ # దోమల నిర్మూలనలో ప్రజాభాగ్యస్వామ్యం తప్పనిసరి వైద్యాధికారిని బాల అంకమ్మ భాయ్ ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నేటి సమాజానికి స్ఫూర్తి_ _రేపటి సమాజానికి వెలుగు "మహిళ" వైద్యాధికారిణి సిరి చందన-ఏపీజిఇఏ అధ్యక్షులు శిఖా శాంసన్ # A M రెడ్డి విద్యాసంస్థల ప్రెసిడెంట్ కన్నుమూత # గుంటూరు అసెంబ్లీ లేదా పార్లమెంట్ సీటుని సాధించడంలో పట్టువీడని విక్రమార్కుడిగా- తాడువాయి రామకృష్ణ

పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి భద్రత: వైద్యాధికారిణి బాల అంకమ్మ భాయ్

క్రోసూరు

Date : 04 April 2024 06:35 PM Views : 200

VM Today News - వార్తలు / పల్నాడు : పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి భద్రత వైద్యాధికారిణి బాల అంకమ్మ బాయి పరిసరాల పరిశుభ్రత పాటిస్తే దోమల ద్వారా వచ్చే వ్యాధులను పారద్రోల వచ్చునని పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి భద్రత అని పలనాడు జిల్లా క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని ఎన్ బాల అంకమ్మ భాయ్ అన్నారు గురువారం ఆమె మండలంలోని పారుపల్లి గ్రామంలో జ్వరాల పరిస్థితి చేపట్టిన పారిశుధ్య చర్యలు వైద్య శిబిరాల నిర్వహణ గూర్చి వివరించారు గ్రామస్తులకు జ్వరాలు పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు మార్చి నెల 5వ తేదీ నుండి గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ప్రస్తుతం గ్రామంలో జ్వరాలు పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నట్లు ఆమె తెలిపారు గ్రామంలో ఎటువంటి వైరల్ జ్వరాలు నమోదు కాలేదని ప్రస్తుతం సంభవించుచున్న జ్వరాలు కేవలం సీజనల్ జ్వరాలు మాత్రమే అని ఆమె పేర్కొన్నారు గ్రామస్తులు ఎండవేడికి తగినట్లుగా సరిపడా ద్రవపదార్థాలు సేవించాలని నీడ పట్టున ఉండాలని ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండలో బయట కు రాకూడదన్నారు ప్రస్తుతం గ్రామ ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఆరోగ్య సిబ్బందికి పంచాయతీ సిబ్బందికి సహకరించవలసిందిగా ఆమె కోరారు ఆరోగ్య సిబ్బంది తెలియజేసే ఆరోగ్య సూచనలు తూచా తప్పకుండా పాటించాలన్నారు గ్రామంలో ఫాగింగ్ కార్యక్రమం దోమల నియంత్రణకు యాంటీ లార్వా ఆపరేషన్ కార్యక్రమం నిర్వహించినట్లు ఆమె తెలిపారు వైద్య సిబ్బంది చే ఇంటింటి లార్వాను కనుగొనే కార్యక్రమం మరియు జ్వరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు గ్రామంలో మురుగునీరు సక్రమంగా పారేటట్లుగా మురుగునీటిపై చెత్తను, కాలువలో గల సిల్టును తోడి సుదూర ప్రాంతాలకు తరలించాలని, మురుగునీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో కాలువలు అన్నిట్లో ఏబేటు తదితర రసాయనాలను పిచికారి చేయించాలని, చెత్త కుప్పలను, ఎరువు దిబ్బలను ఊరికి దూరంగా ఉండేటట్లు చూడాలని, దోమతెరలు వినియోగించుకోవలసినదిగా ప్రజలకు విస్తృతంగా ప్రచారం గ్రావించాలని , పందులను ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండేటట్లు చూడాలని ఆమె గ్రామ కార్యదర్శికి ఆదేశించినట్లు తెలియజేశారు


VM Today News

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2024. All right Reserved.

Developed By :