Saturday, 16 May 2026 04:38:04 AM
# నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

క్షయ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

క్రోసూరు

Date : 24 March 2024 01:03 PM Views : 1996

VM Today News - వార్తలు / పల్నాడు : క్షయ వ్యాధి నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని క్షయ వ్యాధి ఎవరికైనా రావొచ్చని క్షయ వస్తే భయం వద్దు మందులు వాడటం ముద్దు అని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ అన్నారు పల్నాడు జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ జిల్లా అధికారి వి మురళీకృష్ణ ఆదేశానుసారం, వైద్యాధికారి బాల అంకమ్మ బాయ్ ఆధ్వర్యంలో ఆదివారం పల్నాడు జిల్లా క్రోసూరు మండలం క్రోసూరులో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా అవగాహన ప్రదర్శన జరిగింది సందర్భంగా శాంసన్ మాట్లాడుతూ రెండు వారాలు పై పడిన దగ్గు, రాత్రిపూట జ్వరం రావడం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం , కళ్లే పడటం ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు అన్నారు క్షయ సోకిన వారికి ప్రాణభయం అక్కర్లేదన్నారు చక్కగా మందులు వాడుతూ పౌష్టికాహారం తీసుకున్నట్లయితే ఈ వ్యాధి నుంచి నివారణ పొందవచ్చు అని పేర్కొన్నారు క్షయ వ్యాధి నివారణకు సిబినాట్, ఎక్సరే ఇతర పరీక్షలు అందుబాటులో ఉన్నాయన్నారు క్షయ వ్యాధిని త్వరితగతిన గుర్తించి సరియైన చికిత్స పొందితే తక్కువ సమయంలో పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలిపారు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు బ్యాక్టీరియాను గాలిలో విడుదల చేసినప్పుడు ఈ వ్యాధి వ్యాపిస్తుందన్నారు 2024వ సంవత్సరం గానూ ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా మనము క్షయ వ్యాధిని నిర్మూలించగలము అనే థీమును రూపొందించినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా టీబి సూపర్వైజర్ సౌజన్య మాట్లాడుతూ టీబి రోగులు అవసరమైన నిష్పత్తిలో అన్ని పోషకాలను కలిగి ఉండే పోషకాహార సమృద్ధిగా మరియు సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు ఉదాహరణకు ఆహారంలో తృణధాన్యాలు మొక్కజొన్న బియ్యం జొన్నలు మినుములు మొదలైనవి ఉండాలన్నారు గుడ్డు చేప కూడా ఎక్కువగా తీసుకోవాలన్నారు టీబి వ్యాధిగ్రస్తులకు ప్రతినెల 500 రూపాయలు నగదు బ్యాంకు ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు ర్యాలీ పిహెచ్సి నుండి కోసూరు ప్రధాన రహదారి గుండా సాగింది. క్షయ వ్యాధి నివారణలో భాగంగా క్షయ వ్యాధిని అంతం చేద్దాం, క్షయ వ్యాధిని సమాజంలో తరిమేద్దాం, టీబి పోతుంది, దేశం గెలుస్తుంది, రెండు వారాల పైబడిన దగ్గు టీబి కి కారణం, కళ్ళే పరీక్ష చేయించుకోండి, క్షయ వ్యాధిని నిర్ధారించుకోండి అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ టీబి సూపర్వైజర్ సౌజన్య స్టాఫ్ నర్స్ అంజమ్మ, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


VM TODAY NEWS

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: