VM టుడే న్యూస్ - వాతావరణం / కామారెడ్డి జిల్లా : నిత్యం పేదవర్గాలకు రెవెన్యూ పరంగా సేవలు అందించి గణతంత్ర దినోత్సవం సందర్బంగా పల్నాడు జిల్లా ఉత్తమ తహసీల్దార్ అవార్డు పొందిన కారంపూడి తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ ను జడ్పీటీసీ షేక్. షఫీ తహసీల్దార్ ను ఘనంగా దుస్యాలువతో సత్కరించారు. ఈ సందర్బంగా జడ్పీటీసీ మాట్లాడుతూ కారంపూడి మండలంలో పనిచేస్తున్న తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ మండలానికే మంచి గుర్తింపు తెచ్చారని ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు అయన సేవలను గుర్తించి ఆయనకు ఉత్తమ అవార్డు ఇవ్వటం శుభపరిణామమని అయన అన్నారు. రెవిన్యూ పరంగా ఏమైనా సమస్యలు ఉంటే తక్షణమే స్పందించి వాటి పరిష్కరనికి తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ కృషి చేస్తారని అనతికాలంలోనే కారంపూడి మండలంలో మంచి పేరు ప్రాఖ్యతలు తెచ్చుకోవటమే కాకుండా అధికారులు ప్రజాప్రతినిధుల ద్రుష్టిలో మంచి స్థానాన్ని పొందరని మండలంలో పని చేసే ప్రతిఒక్క అధికారి తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ ను ఆదర్శంగా తీసుకొని కారంపూడి మండలానికి మంచి పేరు తెచ్చేలా అందరు కృషి చేయాలనీ ఈ సందర్బంగా అయన కోరారు. అనంతరం ఉత్తమ అవార్డు పొందిన శ్రీనివాస్ యాదవ్ కు జడ్పీటీసీ షఫీ ఇతర నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వేముల. లింగయ్య, కోఆప్షన్ సభ్యులు అంతరగడ్డ. ఏసోబు, కన్నమదాసు సేవసంఘం అధ్యక్షులు మర్రి. శేషయ్య, అంబేద్కర్ యూత్ అధ్యక్షులు జొన్నలగడ్డ. శ్రీను, ఒప్పిచర్ల మరియదాసు, సయ్యద్.సాజన్, అంజుమాన్ కమిటీ ఉపాధ్యక్షులు యాసిన్ , పాఠన్ జానీ, పంచాయతీ వార్డ్ సభ్యులు కాలే. రాంబాబు, అంజి, షేక్. జానీభాషా (అయ్యప్ప ) తదితరులు పాల్గొన్నారు.
కారంపూడి
Admin
VM టుడే న్యూస్