Tuesday, 28 July 2026 04:30:06 PM
# నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

ప్రజలకు జవాబుదారితనంగా సేవలు అందించాల్సిన ప్రభుత్వ శాఖలోనే: ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి భారీ మొత్తంలో ముడుపులు!!

రాజుపాలెం

Date : 11 April 2024 05:28 PM Views : 1798

VM Today News - వార్తలు / పల్నాడు : రాజుపాలెం :- ప్రజలకు జవాబు దారితనంగా సేవలు అందించాల్సిన ప్రభుత్వ శాఖలలోని అధికారులు అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి భారీ మొత్తాలలో ముడుపులు అందుకుంటూ ప్రభుత్వ నిబంధనలు కాలరాస్తూ అవినీతి సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒకవైపు ఏసీబీ అధికారులు అవినీతి సామ్రాట్‌లుగా వ్యవహరించే వారి భరతం పడుతున్నా కొంతమంది అవినీతి అధికారులు జంకుబెంకు లేకుండా పైసా వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ శాఖలలోని ఉద్యోగులకు రాజ్యాంగం కల్పించిన అవకాశాలను అడ్డగోలుగా వాడుకుంటూ ప్రజలను జలగల్లా పీక్కు తింటున్నారు. ఇప్పుడు ఏకంగా రాజుపాలెం రెవెన్యూ అధికారులు ప్రభుత్వం నిధులుకే గండికోడుతున్నారు.జగనన్న భూరక్ష పేరుతో ప్రభుత్వం భూమికి డ్రోన్లతో సర్వే నిర్వహించి సర్వే పూర్తి చేశారు హద్దురాళ్లు పాతేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. నిధుల్లో భాగంగా ఒక్కొక్క రాయికి రూ.150 /- ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైనట్లు అధికారులు తెలిపిన్నారు. కానీ రాజుపాలెం మండలంలో హద్దురాలను పాతేందుకు 105 రూపాయలు కూలి చెల్లించి కొన్ని రాళ్లు పాతకుండా ఊరు చివర పొలాల్లో వదిలిపెట్టిన్నారు. మండలలోని చౌటపాపాయపాలెం గ్రామానికి 1397 రాళ్లు, రాజుపాలెం గ్రామానికి 1390 రాళ్లు, రెడ్డిగూడెం గ్రామానికి 1390 రాళ్ల చొప్పున మొత్తం 4177 సర్వే రాళ్లులను పంపియున్నారు. హద్దుల నిమిత్తం ఒక్కొక్క రాయి నిర్మించేందుకు రాయికి 150 రూపాయలు చొప్పున ప్రభుత్వం నుండి సుమారు రూ..6.26,550 నిధులు విడుదల చేసినట్లు తెలిపియున్నారు. కానీ మండల సర్వేలు కూలీలకు 105 రూపాయలు చెల్లించి మిగిలిన 45 రూపాయలు చొప్పున 1.87.965 /- రూ రవాణా చెల్లింపు తదితర ఖర్చుల పేరుతో తన జేబులో వేసుకున్నట్లు తెలుస్తుంది. సచివాలయం అధికారుల స్థాయి నుండి రెవిన్యూలో పై అధికారుల స్థాయి వరకు అందరికి ముడుపులు అందటంతో ఎవరిని ఏమి అడిగిన పొంతన లేని సమాధానం చెప్తూ తప్పించుకుంటున్నారు.ఇప్పటికైన దీనిపై జిల్లా స్థాయి అధికారులు స్పందించి జరిగిన అవినీతిని వెలికితీసి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామ ప్రజలు కోరుతున్నారు .దీనిపై మండల ఇన్ఛార్జ్ తాసిల్దార్ వివరణ కోరగా మండల సర్వేయర్ రిపోర్ట్ అడిగానని రిపోర్టును పరిశీలించి ఆర్డీవోకి పంపిస్తానని తెలిపారు.


VM TODAY NEWS

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: