VM Today News - రాజకీయం / పల్నాడు : సమాజం కోసం ఎంతగానో తపించే వృత్తుల్లో వైద్య వృత్తి ఒకటి.అలాంటి వృత్తి నుండి వచ్చిన వాడిగా చెబుతున్నా నియోజకవర్గంలోని వైద్యులకు అండగా నిలిచే బాధ్యత తీసుకుంటానని ఎన్డీఏ కూటమి నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్ధి డా౹౹చదలవాడ అరవింద బాబు హామీ ఇచ్చారు.ఈ మేరకు నరసరావుపేట పట్టణంలోని కపిలవాయి విజయ్ కుమార్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆర్ఎంపి డాక్టర్ల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిధులుగా డా౹౹చదలవాడ అరవింద బాబు,లావు మేఘన,పట్టణంలోని ముఖ్య డాక్టర్లు హాజరయ్యారు.జగన్ రెడ్డి ధన దాహం కారణంగా రాష్ట్రంలో వేలాది మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన పేదలు కల్తీ మద్యంతో ప్రాణాలు కోల్పోతున్నారు.కిడ్నీ వ్యాధులతో మంచాన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మళ్లీ జగన్ రెడ్డి అధికారంలోకి వస్తే.ఈ సారి ప్రజల అవయవాలు కూడా అమ్ముకుంటాడేమోనని ఆవేదన వ్యక్తం చేశారు.జగన్ రెడ్డి లాంటి దోపిడీదారుని రాష్ట్రం నుండి తరిమేందుకు వైద్యులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.ఎంతో మంది నాయకులను చూశాం.కానీ,ప్రజల ప్రాణాలను తీస్తూ.అందులో కూడా కాసులు వెతుక్కునే వారిని ఎప్పుడూ చూడలేదన్నారు.వైద్యులు అంటేనే సమాజం పై ఎంతో సేవా భావం కలిగిన వారు,అలాంటి వైద్యుల్ని కూడా వేధించి చంపిన దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి అన్నారు.నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్,చిత్తూరులో డాక్టర్ అణితారాణి లాంటి వారిని వేధించిన విధానం అత్యంత బాధాకరం అన్నారు.ప్రజలంతా కూటమిని గెలిపించేందుకు సిద్ధమైపోయారన్నారు.సేవా భావం కలిగిన వ్యక్తులుగా మనం కూడా వారి సంకల్పానికి తోడుగా నిలుద్దామని డా౹౹చదలవాడ అరవింద బాబు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు.
Admin
VMToday News