VM Today News - వార్తలు / పల్నాడు : పల్నాడు జిల్లా, సత్తెనపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ కీలక నేత సత్తెనపల్లి సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు పార్టీకి రాజీనామా చేశారు. డిసెంబర్ 18 2022న జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ స్వయంగా కండువా కప్పి బొర్రా వెంకట అప్పారావును ఆహ్వానించారు. అంతేకాకుండా కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహణ బాధ్యతలు నిర్వహించిన బొర్రా వెంకట అప్పారావు. గ్రామాల్లో జనసేన పార్టీ జెండాలను ఆవిష్కరించారు. జనసేన పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేశారు. కూటమి పార్టీలలో సమన్వయ లోపాల వలన పార్టీకి రాజీనామా చేశారు. తదుపరి కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు...
Reporter
VMToday News