Saturday, 27 July 2024 04:15:29 PM
# వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువనాయకులు కన్నా నాగరాజు # బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది # క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్ # ఆర్యవైశ్యులకు అండగా నిలిచే డా౹౹చదలవాడ అరవింద బాబుని గెలిపించుకుందాం # లోక్‌సభకు 965, అసెంబ్లీకి 5,460 నామినేషన్లు # ఎన్నికల ప్రచారంలో మాజీ మేయర్ # సమాజమే దేవాలయమనేది మన నినాదం సమాజం ఉన్నదే దోపిడీకి అనేది వైసీపీ నినాదం వైద్యుల్ని కూడా వేధించిన దుర్మార్గుడైన జగన్ రెడ్డి,గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి # ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న:బొర్రా # గోపిరెడ్డికి వణుకు పుట్టిస్తున్న టిడిపి చేరికలు: డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు జేజేలు కొడుతున్న ప్రజలు # క్రోసూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి బాల అంకమ్మ బాయ్ ఆధ్వర్యంలో మలేరియా పై అవగాహన సదస్సు # మానవ హక్కుల ప్రదాత బి.ఆర్ అంబేద్కర్: APGEA క్రోసూరు యూనిట్ అధ్యక్షులు శిఖా శాంసన్ # ప్రజలకు జవాబుదారితనంగా సేవలు అందించాల్సిన ప్రభుత్వ శాఖలోనే: ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి భారీ మొత్తంలో ముడుపులు!! # పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి భద్రత: వైద్యాధికారిణి బాల అంకమ్మ భాయ్ # ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వేసవికాలంలో జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి: ఆరోగ్య విస్తరణ అధికారి

దోమల నిర్మూలనలో ప్రజాభాగ్యస్వామ్యం తప్పనిసరి వైద్యాధికారిని బాల అంకమ్మ భాయ్ ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

క్రోసూరు

Date : 11 March 2024 05:20 PM Views : 165

VM Today News - వార్తలు / పల్నాడు : పల్నాడు జిల్లా క్రోసూరు మండలం పారుపల్లి గ్రామంలో జ్వర పీడితులు ఎక్కువగా ఉన్నారు అనిన సమాచారంతో సోమవారం పారుపల్లి గ్రామాన్ని క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ అంకమ్మ బాయ్ సందర్శించారు గ్రామంలో జరుగుతున్న దోమల నియంత్రణ చర్యలను ఆమె పరిశీలించారు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు జ్వరాలతో సత్తనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పారుపల్లి గ్రామస్తులను ఆమె ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ తో కలిసి సందర్శించారు వివరాలను సేకరించారు. పారుపల్లి గ్రామంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని గ్రామంలో డెంగ్యూ కేసులు ఏమి నమోదు కాలేదని ఆమె పేర్కొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ అంకం బాయ్ మాట్లాడుతూ ఇంటి మురికి కాలవల్లో చెత్తాచెదారం వేయకూడదని మురికి నీరు ఎప్పుడు పారే విధంగా చూడాలన్నారు ఇంటి పరిసరాలలో పనికిరాని డబ్బాలు, టైర్లు, కొబ్బరి చిప్పలు మొదలగు వాటిలో వర్షపు నీరు చేరి దోమలు ఉత్పత్తి జరుగుతుందన్నారు అలాంటి వాటిని తొలగించాలని పేర్కొన్నారు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా విధిగా ప్రజలు అందరు కూడా డ్రైడే పాటించాలని అన్ని నీటి నిల్వలను పాత్రలను శుబ్రపరిచి తిరిగి నీరు నింపుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మాట్లాడుతూ మురికి నీరు నిల్వ ఉన్నచోట వారానికి ఒకసారి కిరోసిన్ ఆయిల్ గాని లేక వాహనాలు రిపేరు చేసిన వేస్ట్ ఆయిల్ గాని చల్లాలన్నారు ఎయిర్ కూలర్ లోని నీటిని వారానికి ఒకసారి మార్చాలన్నారు రెండు లేక మూడు రోజులకి మించి జ్వరంతో బాధపడుతున్న వ్యక్తులు సమీపంలోని ఆరోగ్య కార్యకర్తను గాని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ను గాని సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో టీ వెంకటరమణ ఈఓఆర్డి శివరామయ్య అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ వెంకటేశ్వరరావు మలేరియా సబ్ యూనిట్ అధికారి షేక్ బేగ్ ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ హెల్త్ సూపర్వైజర్ శివుడు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ జ్యోతి ఆరోగ్య కార్యకర్త రాజేశ్వరి ఆశా కార్యకర్తలు గ్రామ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు


VM Today News

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2024. All right Reserved.

Developed By :