VM Today News - రాజకీయం / పల్నాడు : నరసరావుపేట 13,14 వార్డుల్లో డా౹౹చదలవాడ తరఫున ఆర్యవైశ్యుల ప్రచారం ప్రజా సేవ తప్ప తప్పు చేయాలనే ఆలోచన కూడా తెలియని ఆర్యవైశ్యుల్ని ముప్పుతిప్పలు పెట్టిన జగన్ రెడ్డిని రాష్ట్రం నుండి తరిమే వరకు ప్రతి ఆర్యవైశ్య సోదరుడూ శ్రమించాలని నరసరావుపేట ఆర్యవైశ్య నేతలు పిలుపునిచ్చారు.ఈ మేరకు నరసరావుపేట 13, 14 వార్డుల్లో మున్సిపల్ మాజీ ఛైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్త,రాష్ట్ర గోల్డ్ బులియన్ మర్చంట్స్ అధ్యక్షులు కపిలవాయి విజయ్ కుమార్,ఇతర ఆర్యవైశ్య కుల సంఘ నాయకులు నరసరావుపేట టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డా౹౹చదలవాడ అరవిందబాబు తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.జగన్ రెడ్డి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులపై దాడులు,వేధింపులు తీవ్రమయ్యాయన్నారు.నల్లబెల్లం పేరుతో చేస్తున్న వేధింపులకు కొదవ లేకుండా పోయిందని వివరించారు.మరోవైపు బోర్డు పన్ను,రోడ్డు పన్ను,చెత్త పన్నుతో వ్యాపారం చేసుకోవాలంటేనే భయపడే పరిస్థితి సృష్టించారన్నారు.చివరికి నరసరావుపేట జి.ట్యాక్స్ భరించలేక వేలాది మంది వ్యాపారాలు మూసుకోవాల్సి వచ్చింది.చంద్రబాబుతో మాత్రమే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.సూపర్ సిక్స్ పథకాలను గడపగడపనా వివరించారు.సమాజం బాగుపడాలన్నా, ప్రజలు బతికి బట్ట కట్టాలన్నా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పటు చేసుకోవాలంటూ గడపగడపకు తెలియజేశారు.
Admin
VMToday News