Thursday, 17 September 2026 04:31:49 AM
# బాల్యవివాహాలను నిర్మూలించడం సమాజ బాధ్యత- అడ్వకేట్ జిజే రావు # 15 వేల రూపాయలు పింఛన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లాకు డివిఎంసి మెంబర్ . డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ విజ్ఞప్తి # భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ సంజన సింహాకు డివిఎంసి మెంబర్ డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ విజ్ఞప్తి # సత్తెనపల్లి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ విజయకేతనంలో మరో మైలురాయి # నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం

పతంజలి బహిరంగ క్షమాపణలపై సుప్రీంకోర్టు సంతృప్తి

Date : 01 May 2024 10:48 AM Views : 1285

VM Today News - వార్తలు / : * న్యూ ఢిల్లీ : పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సామర్థ్యంపై ఇచ్చిన మోసపూరిత ప్రకటనలకు గాను యోగా గురు రాందేవ్‌, ఆచార్య బాలకృష్ణ, సంబంధిత సంస్థ సంయుక్తంగా.. వార్తా పత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు వెలువరించడంపై సుప్రీంకోర్టు మంగళవారం సంతృప్తి వ్యక్తం చేసింది. ఆ ప్రకటనల్లో వినియోగించిన భాష, వాటిలో ప్రస్తావించిన పేర్లు సముచితంగానే ఉన్నాయని జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ అహసానుద్దీన్‌ అమానుల్లా ధర్మాసనం తెలిపింది. ఇదే విషయాన్ని రాందేవ్‌, ఆచార్య బాలకృష్ణ, పతంజలి సంస్థ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీకి తెలిపింది. అయితే, ఆ ప్రకటనల ప్రతుల డిజిటల్‌ ఫైలింగ్‌పై జస్టిస్‌ హిమా కోహ్లీ అభ్యంతరం తెలిపారు. అన్ని వార్తా పత్రికల్లో ప్రచురితమైన క్షమాపణ ప్రకటనల ఒరిజినల్‌ పేజీలను రికార్డు చేయాలని ఏప్రిల్‌ 23న తాము ఆదేశించామని స్పష్టం చేశారు. ధర్మాసనం ఆదేశాలను అర్థంచేసుకోవడంలో, వాటిని తమ సిబ్బందికి తెలియజేయడంలో పొరపాటు జరిగిందని పతంజలి తరఫు న్యాయవాది అంగీకరించారు. దీంతో ఈ కేసులో ‘చివరి అవకాశం’ కల్పిస్తున్నామని చెబుతూ క్షమాపణ ప్రకటనల ఒరిజినల్‌ పేజీలను రికార్డు చేసుకునేలా కోర్టు రిజిస్ట్రీకి ధర్మాసనం ఆదేశాలిచ్చింది. విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా రాందేవ్‌ బాబా, ఆచార్య బాలకృష్ణలకు వ్యక్తిగత హాజరీ నుంచి మినహాయింపునివ్వాలని సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ విజ్ఞప్తి చేశారు. ఆ మినహాయింపు తదుపరి ఒక్క వాయిదాకు మాత్రమే పరిమితమని ధర్మాసనం స్పష్టంచేస్తూ అంగీకరించింది. ఇప్పటికి నిద్ర లేచారు..’ పతంజలి కేసు విచారణ సందర్భంగా ఉత్తరాఖండ్‌ రాష్ట్ర లైసెన్సింగ్‌ అథారిటీ తీరుపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఆ సంస్థకు చెందిన 14 ఉత్పత్తులు, అనుబంధ విభాగం దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్సును నిలిపివేసిన విషయాన్ని రాష్ట్ర లైసెన్సింగ్‌ అథారిటీ మంగళవారం ధర్మాసనానికి తెలిపింది. ‘‘ఏప్రిల్‌ 10న మేము ఇచ్చిన ఆదేశాల తర్వాతే ఉత్తరాఖండ్‌ అధికారులు నిద్ర నుంచి మేల్కొన్నట్లు కన్పిస్తోంది.  ఆరేళ్ల నుంచి సంస్థపై మీరెందుకు చర్యలు తీసుకోలేదు? కోర్టు సానుభూతి, కరుణ కావాలంటే నిజాయతీగా ఉండండి’’ అని జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ అహసానుద్దీన్‌ అమానుల్లా ధర్మాసనం మందలించింది. అయితే, ఈ చర్యలను చట్ట ప్రకారం తీసుకున్నారా? లేదా అన్నది పరిశీలించాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది. 2018 నుంచి ఇప్పటి వరకు హరిద్వార్‌ జిల్లా ఆయుర్వేదిక్‌, యునానీ అధికారులుగా ఉన్న వారందరూ పది రోజుల్లోగా విడివిడిగా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది.


T srinivasarao

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: