Saturday, 27 July 2024 03:51:34 PM
# వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువనాయకులు కన్నా నాగరాజు # బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది # క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్ # ఆర్యవైశ్యులకు అండగా నిలిచే డా౹౹చదలవాడ అరవింద బాబుని గెలిపించుకుందాం # లోక్‌సభకు 965, అసెంబ్లీకి 5,460 నామినేషన్లు # ఎన్నికల ప్రచారంలో మాజీ మేయర్ # సమాజమే దేవాలయమనేది మన నినాదం సమాజం ఉన్నదే దోపిడీకి అనేది వైసీపీ నినాదం వైద్యుల్ని కూడా వేధించిన దుర్మార్గుడైన జగన్ రెడ్డి,గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి # ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న:బొర్రా # గోపిరెడ్డికి వణుకు పుట్టిస్తున్న టిడిపి చేరికలు: డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు జేజేలు కొడుతున్న ప్రజలు # క్రోసూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి బాల అంకమ్మ బాయ్ ఆధ్వర్యంలో మలేరియా పై అవగాహన సదస్సు # మానవ హక్కుల ప్రదాత బి.ఆర్ అంబేద్కర్: APGEA క్రోసూరు యూనిట్ అధ్యక్షులు శిఖా శాంసన్ # ప్రజలకు జవాబుదారితనంగా సేవలు అందించాల్సిన ప్రభుత్వ శాఖలోనే: ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి భారీ మొత్తంలో ముడుపులు!! # పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి భద్రత: వైద్యాధికారిణి బాల అంకమ్మ భాయ్ # ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వేసవికాలంలో జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి: ఆరోగ్య విస్తరణ అధికారి

పతంజలి బహిరంగ క్షమాపణలపై సుప్రీంకోర్టు సంతృప్తి

Date : 01 May 2024 10:48 AM Views : 109

VM Today News - వార్తలు / : * న్యూ ఢిల్లీ : పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సామర్థ్యంపై ఇచ్చిన మోసపూరిత ప్రకటనలకు గాను యోగా గురు రాందేవ్‌, ఆచార్య బాలకృష్ణ, సంబంధిత సంస్థ సంయుక్తంగా.. వార్తా పత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు వెలువరించడంపై సుప్రీంకోర్టు మంగళవారం సంతృప్తి వ్యక్తం చేసింది. ఆ ప్రకటనల్లో వినియోగించిన భాష, వాటిలో ప్రస్తావించిన పేర్లు సముచితంగానే ఉన్నాయని జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ అహసానుద్దీన్‌ అమానుల్లా ధర్మాసనం తెలిపింది. ఇదే విషయాన్ని రాందేవ్‌, ఆచార్య బాలకృష్ణ, పతంజలి సంస్థ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీకి తెలిపింది. అయితే, ఆ ప్రకటనల ప్రతుల డిజిటల్‌ ఫైలింగ్‌పై జస్టిస్‌ హిమా కోహ్లీ అభ్యంతరం తెలిపారు. అన్ని వార్తా పత్రికల్లో ప్రచురితమైన క్షమాపణ ప్రకటనల ఒరిజినల్‌ పేజీలను రికార్డు చేయాలని ఏప్రిల్‌ 23న తాము ఆదేశించామని స్పష్టం చేశారు. ధర్మాసనం ఆదేశాలను అర్థంచేసుకోవడంలో, వాటిని తమ సిబ్బందికి తెలియజేయడంలో పొరపాటు జరిగిందని పతంజలి తరఫు న్యాయవాది అంగీకరించారు. దీంతో ఈ కేసులో ‘చివరి అవకాశం’ కల్పిస్తున్నామని చెబుతూ క్షమాపణ ప్రకటనల ఒరిజినల్‌ పేజీలను రికార్డు చేసుకునేలా కోర్టు రిజిస్ట్రీకి ధర్మాసనం ఆదేశాలిచ్చింది. విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా రాందేవ్‌ బాబా, ఆచార్య బాలకృష్ణలకు వ్యక్తిగత హాజరీ నుంచి మినహాయింపునివ్వాలని సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ విజ్ఞప్తి చేశారు. ఆ మినహాయింపు తదుపరి ఒక్క వాయిదాకు మాత్రమే పరిమితమని ధర్మాసనం స్పష్టంచేస్తూ అంగీకరించింది. ఇప్పటికి నిద్ర లేచారు..’ పతంజలి కేసు విచారణ సందర్భంగా ఉత్తరాఖండ్‌ రాష్ట్ర లైసెన్సింగ్‌ అథారిటీ తీరుపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఆ సంస్థకు చెందిన 14 ఉత్పత్తులు, అనుబంధ విభాగం దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్సును నిలిపివేసిన విషయాన్ని రాష్ట్ర లైసెన్సింగ్‌ అథారిటీ మంగళవారం ధర్మాసనానికి తెలిపింది. ‘‘ఏప్రిల్‌ 10న మేము ఇచ్చిన ఆదేశాల తర్వాతే ఉత్తరాఖండ్‌ అధికారులు నిద్ర నుంచి మేల్కొన్నట్లు కన్పిస్తోంది.  ఆరేళ్ల నుంచి సంస్థపై మీరెందుకు చర్యలు తీసుకోలేదు? కోర్టు సానుభూతి, కరుణ కావాలంటే నిజాయతీగా ఉండండి’’ అని జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ అహసానుద్దీన్‌ అమానుల్లా ధర్మాసనం మందలించింది. అయితే, ఈ చర్యలను చట్ట ప్రకారం తీసుకున్నారా? లేదా అన్నది పరిశీలించాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది. 2018 నుంచి ఇప్పటి వరకు హరిద్వార్‌ జిల్లా ఆయుర్వేదిక్‌, యునానీ అధికారులుగా ఉన్న వారందరూ పది రోజుల్లోగా విడివిడిగా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది.


T srinivasarao

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2024. All right Reserved.

Developed By :