VM Today News - వార్తలు / పల్నాడు : రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముంగిటికే వైద్యం అనే విధానంలో అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమం పల్నాడు జిల్లా కోసూరు మండలం పరిధిలోని ఊటుకూరు సచివాలయంలో శుక్రవారం నిర్వహించారు రోగులకు డాక్టర్ బి వి ఎస్ రమాదేవి, డాక్టర్ టి సుధీర్ కుమార్, డాక్టర్ ఎన్ సుమిత్ర లు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందించారు బిపి షుగర్ మరియు సాధారణ వ్యాధిగ్రస్తులకు 309 మందికి వైద్య సేవలు అందించారు కంటి చూపు లోపం ఉన్నవారికి ఉచిత అద్దాలను పొందేందుకు 29 మందికి సిఫార్సు చేశారు ఈ శిబిరాన్ని క్రోసూరు మండల పరిషత్ అధ్యక్షులు పెరుమాళ్ళ కోటయ్య ఎంపీడీవో వెంకటరమణ సందర్శించారు ఈ కార్యక్రమంలో సి హెచ్ ఓ సాంబశివ రావు ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ సూపర్వైజర్ శివుడు గ్రామ కార్యదర్శి షేక్ ఖాజావలి సర్పంచ్ జర్రిపోతు బుచ్చయ్య ఊటుకూరు సచివాలయం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మాబు లాబి ఆరోగ్య కార్యకర్త లక్ష్మి ఒప్త్మలిక్ మమత ఫార్మసిస్ట్ ఫాతిమా వివిధ గ్రామాల కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఆశా కార్యకర్తలు హెల్త్ అసిస్టెంట్ ప్రేమ రాజు మహిళా ఆరోగ్య కార్యకర్తలు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Admin
VMToday News