VM Today News - రాజకీయం / నంద్యాల : కాంగ్రెస్ పార్టీ అంధ్రప్రదేశ్ పై పూర్తిగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన గిద్దలూరు కి చెందిన మాజీ సైనికుడు సామాజిక కార్యకర్త నారు తిరుమల నాయుడు కి కాంగ్రెస్ పార్టీ కీలకమైన బాధ్యతలు అప్పగించింది. అమరావతి లోని ఐయన్టియుసి కార్యాలయ ప్రతినిధి జేటి రామారావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీయూసీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడం కోసం నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో కనిగిరికి చెందిన మహిళా నాయకురాలు కదిరి భవానీని రాష్ట్ర అధ్యక్షురాలుగా, నారు తిరుమల నాయుడు ని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటుగా ఐఎన్టియుసి జాతీయ ఉపాధ్యక్షులు ఏకే చౌదరి నియమించారని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ లో కార్మికుల హక్కులు, కార్మిక చట్టాల అమలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, వెట్టి చాకిరి, సమాన పనికి సమాన వేతనం తదితర అంశాలపై అవగాహన మరియు పోరాట దిశగా కార్మికుల హక్కులు కాపాడాలని ఏకే చౌదరి తెలియజేశారని అమరావతి ఐఎన్టీయూసీ కార్యాలయ ప్రతినిధి జేటి రామారావు తెలిపారు.
Admin
VMToday News