VM Today News - రాజకీయం / పల్నాడు : ఏపీ సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాల్లో మంత్రులు సహనం కోల్పోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్పై ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి అధికారులను పిలిస్తే తాము హాజరవుతామని స్పష్టం చేశారు. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలకు మంచి భవిష్యత్తు కలగాలని కోరుకుంటారని అన్నారు. రాష్ట్రంలో చట్టవ్యవస్థ బలహీనపడిందని విమర్శించారు. పరిపాలనలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. వ్యవస్థ దెబ్బతిన్న పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం మాట నిలబెట్టుకుని అర్హులైన మహిళలకు వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. “సూపర్ 6” హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని హెచ్చరించారు. పోలీస్ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు వాడుతున్నారని ఆరోపించారు. తమ పార్టీ నాయకులను అనవసరంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. రాంబాబు కుటుంబంపై వ్యవహరించిన తీరు సరైనది కాదని అన్నారు. ఏ తల్లి అయినా ఒకటేనని, ఈ విషయంలో ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు.
Reporter
VMToday News