VM Today News - రాజకీయం / గుంటూరు : కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకరరరావు క్రోసూరు మండలంలో వైఎస్సార్సీపీలోకి చేరికలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. టీడీపీకి చెందిన 15 కుటుంబాల వారు ఇవాళ వైఎస్సార్సీపీలో చేరారు. పెదకూరపాడు శాసనసభ్యులు శ్రీ నంబూరు శంకరరావు.. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సీఎం శ్రీ వైఎస్ జగన్ అందించిన సంక్షేమం నచ్చి ఎంతోమంది పార్టీలో చేరుతున్నారన్నారు. మరోసారి తనను ఆదరించి ఆశీర్వదిస్తే.. పెదకూరపాడు నియోజకవర్గాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా మారుస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. వైఎస్సార్సీపీలో చేరిన వారిలో శవలం చిన్నప్ప, శవలం పిచ్చమ్మ, ప్రశాంతి, ద్వారక, శశి కుమార్, పల్లె సుక్కమ్మ, నరసింహా,పల్లె అంతోని, కిట్టారావు, చిన్నమ్మాయి, మణెమ్మ, పల్లె మంత్రాల, మేరి, అరవింద్ తదితరులున్నారు.
Reporter
VMToday News