VM Today News - రాజకీయం / పల్నాడు : సత్తెనపల్లి ప్రజల్లో విశ్వసనీయత, జనాదరణ కలిగిన ఏకైక నేత జగన్మోహన్ రెడ్డి అని, ఏదైనా చెప్పిందే చేస్తాడు.. చేసేదే చెప్తాడని రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు, నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి అభ్యర్థి అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని యన్నాదేవి గ్రామములో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానికు మహిళలు వ్యతిరేకి హారతులు ఇచ్చారు. గుమ్మడికాయలతో దిష్టి తీశారు .ప్రచార రథంపై ఆయన వెంట అశేష జనం తరలిరాగా ప్రధాన వీధుల్లో పర్యటించారు. అనంతరం ముఖ్య నాయకులు , క్రియాశీలక కార్యకర్తల నివాసాలకు వెళ్లి చర్చించారు. మే నెల 13వ తేదీన ఎన్నికల నిర్వహణకు నాయకులను ఆయన సమయాయత్తం చేశారు. ప్రతి వ్యక్తి కీలకమైనవారెన్సీన్నారు. ఈ ఐదేళ్లలో వైయస్సార్సీపి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు తీసుకున్న ప్రతి ఒక్కరు మనకు బ్రాండ్ అంబాసిడర్ లే అన్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన మానిఫెస్టోపట్ల ప్రజల్లో మంచి స్పందన లభించిందన్నారు. జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే నెరవేరుస్తాడని, మాట తప్పడని చర్చ జరుగుతోందన్నారు. గత ప్రజా ప్రయోజకరమైన పథకాన్నిటినీ కొనసాగిస్తూనే వాటిని విస్తరించడం, మెరుగుపరచడం శుభపరిణామన్నారు. ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి అవసరమైన సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రకటించారని గుర్తు చేశారు. మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంథం అన్నారు. రానున్న ఎన్నికల్లో విశ్వసనీయతకు అండగా ఉండాలన్నారు. ఫ్యాను గుర్తుకు ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలన్నారు. నియోజకవర్గంలో నన్ను , పార్లమెంటు పరిధిలో అనిల్ కుమార్ యాదవ్ ను గెలిపించి మాకు తోడ్పాటు నివ్వాలన్నారు. ఈ సందర్భంగా అంబటికి స్థానిక నాయకులు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందిన సంక్షేమం గురించి ఆరా తీశారు. కార్యక్రమంలో రూరల్ మండల కన్వీనర్ రాయపాటి పురుషోత్తమరావు , స్థానిక నాయకులు , ప్రజాప్రతినిధులు వైయస్సార్ సిపి అనుబంధ సంఘాల బాధ్యులు, పూర్వ వాలంటీర్లు తదితరులు ఉన్నారు
Reporter
VMToday News