VM Today News - రాజకీయం / పల్నాడు : గత ప్రభుత్వ కాలం నుండి పెండింగ్లో ఉన్న రూ. 1200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై మంత్రి నారా లోకేష్ తీసుకున్న నిర్ణయానికి స్పందిస్తూ వినుకొండలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు, వినుకొండ నియోజకవర్గ తెలుగు యువత మరియు టిఎన్ఎస్ఎఫ్ (TNSF) ఆధ్వర్యంలో భారీ కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్ నుండి స్తూపం వరకు కొనసాగిన ఈ ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బకాయిలు విడుదల చేసినందుకు నాయకులు అభినందనలు తెలియజేశారు.
Reporter
VMToday News