VM Today News - రాజకీయం / పల్నాడు : నకరికల్లు: నకరికల్లు మండలం నకరికల్లు అడ్డరోడ్డు మరియు చల్లగుండ్ల గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన నాయకులు బొర్రా వెంకట అప్పారావు మరియు మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ. నకరికల్లు అడ్డరోడ్డు మరియు చల్లగుండ్ల గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, జనసేన నాయకులు బొర్రా వెంకట అప్పారావు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తప్పెట్లతో స్వాగతం పలికిన గ్రామస్తులు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి తెలియజేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలని బొర్రా వెంకట అప్పారావు మరియు కన్నా అభ్యర్థించారు.
Reporter
VMToday News