VM Today News - రాజకీయం / పల్నాడు : అమరావతి: వెంకటపాలెం టీటీడీ ఆలయంలో ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. రాష్ట్ర బడ్జెట్ ప్రతులను స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ వేదపండితులు మంత్రికి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా తీర్థప్రసాదాలు స్వీకరించారు. పూజల అనంతరం స్వల్పంగా మాట్లాడిన మంత్రి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికే కట్టుబడి ఉందని తెలిపారు. తదుపరి కార్యక్రమంగా అమరావతిలో జరుగనున్న క్యాబినెట్ సమావేశానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు అధికారులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Reporter
VMToday News