Wednesday, 16 September 2026 03:27:30 AM
# బాల్యవివాహాలను నిర్మూలించడం సమాజ బాధ్యత- అడ్వకేట్ జిజే రావు # 15 వేల రూపాయలు పింఛన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లాకు డివిఎంసి మెంబర్ . డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ విజ్ఞప్తి # భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ సంజన సింహాకు డివిఎంసి మెంబర్ డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ విజ్ఞప్తి # సత్తెనపల్లి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ విజయకేతనంలో మరో మైలురాయి # నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం

మేలు చేసిన వారికే మళ్లీ పట్టం కట్టండి

Date : 06 May 2024 12:52 PM Views : 1196

VM Today News - రాజకీయం / పల్నాడు : మేలు చేసిన వారికే మళ్లీ పట్టం కట్టండి. కుట్రల కూటమికి ఓటుతో బుద్ధి చెప్పండి గోళ్లపాడు, కుందురువారిపాలెం  గ్రామాలలో ప్రచారంలో మంత్రి అంబటి. ప్రచారంలో పాల్గొన్న నిమ్మకాయల, ఇతర ప్రజాప్రతినిధులు కుట్రల కూటమికి ఓటుతో బుద్ధి చెప్పాలని,ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని ప్రతి ఇంటికి మేలు చేసిన జగన్మోహన్ రెడ్డికే మళ్లీ పట్టం కట్టాలని రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు , నియోజకవర్గ వైఎస్ఆర్సిపి అభ్యర్థి అంబటి రాంబాబు అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోని గోళ్లపాడు, కుందురువారిపాలెం గ్రామాల్లో గుంటూరు ఏఎంసీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గోళ్లపాడు లో ముందుగా ఎస్టీ కాలనీ వద్ద స్థానిక మహిళలు భారీగా ఎదురేగి స్వాగతం పలికారు. హారతులు ఇచ్చి ,శాలువా కప్పి సత్కరించి, విజయతిలకం దిద్దారు. అనంతరం కాలనీలో ప్రధాన వీధుల్లో ప్రచారంపై పర్యటించారు. ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ, ఫ్యాను గుర్తుకే ఓటు వేయమని చెప్తూ ముందుకు సాగారు. గ్రామములో స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన డీజే, తీన్మార్ల డప్పుల మేళాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కుందురువారి పాలెం గ్రామంలోనూ అంబటి కి అపూర్వ ఆదరణ లభించింది. మహిళలు గుమ్మడికాయలతో దిష్టి తీసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో వేరు వేరు సమయాల్లో అంబటి మాట్లాడుతూ మధ్యవర్తులు లేకుండా సంక్షేమ పథకాలను నేరుగా, పారదర్శకంగా లబ్ధిదారుల ఖాతాకే జమ చేయడం ద్వారా రాష్ట్రంలో సరికొత్త సంక్షేమ విప్లవాన్ని జగనన్న తీసుకు వచ్చారన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ప్రతి రూపాయి లబ్ధిదారులకే చేయడంతో పేద ప్రజల హృదయాల్లో జగనన్న సుస్థిర స్థాయిలో నిలిచిపోయారన్నారు. ఈ సంక్షేమాభివృద్ధి కొనసాగాలంటే ఫ్యాను గుర్తుకు ఓటు వేసి జగనన్నను గెలిపిద్దామని ఆయన కోరారు. ఈనెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో నియోజకవర్గంలో నన్ను ,పార్లమెంట్లో అనిల్ కుమార్ యాదవ్ ను గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ నక్క శ్రీనివాసరావు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, వైయస్సార్సీపీ అనుబంధ సంఘాల బాధ్యులు తదితరులున్నారు.


Gopi

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: