Tuesday, 18 February 2025 09:38:58 PM
# రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువనాయకులు కన్నా నాగరాజు # బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది # క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్ # ఆర్యవైశ్యులకు అండగా నిలిచే డా౹౹చదలవాడ అరవింద బాబుని గెలిపించుకుందాం # లోక్‌సభకు 965, అసెంబ్లీకి 5,460 నామినేషన్లు # ఎన్నికల ప్రచారంలో మాజీ మేయర్ # సమాజమే దేవాలయమనేది మన నినాదం సమాజం ఉన్నదే దోపిడీకి అనేది వైసీపీ నినాదం వైద్యుల్ని కూడా వేధించిన దుర్మార్గుడైన జగన్ రెడ్డి,గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

అన్నా మేమంతా మీ వెంటే.. మాకు మంచి చేసింది నువ్వే..

Date : 11 May 2024 10:23 AM Views : 278

VM Today News - రాజకీయం / పల్నాడు : మునగోడు, తురగావారిపలెంలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకి జననీరాజనం అన్నా మీ పాలనలోనే మాకు మంచి జరిగింది. సంక్షేమ పథకాలతో మా బతుకులు బాగుపడ్డాయి.. మేమంతా మీ వెంటే.. అమరావతి ఎస్సీ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకి జనం చెప్పిన మాటలు ఇవి. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమరావతి మండలం మునగోడు, తురగావారిపాలెం గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకి స్థానికులు నీరాజనం పలికారు. పూలతో స్వాగతం పలికి.. హారతులు పట్టారు. ఓట్లు వేయాలని ఎమ్మెల్యే అడగకముందే.. వారంతా.. తమకు జగనన్న పాలనలో మంచి జరిగిందని.. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాయని తెలిపారు. తమ జీవితాలు బాగుచేసిన జగనన్నకే తమ ఓటు అని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో పెదకూరపాడు నియోజకవర్గాన్ని తాను ఎంతో అభివృద్ధి చేశానని.. 30 ఏళ్లలో జరగని అభివృద్ధి.. గత ఐదేళ్లో జరిగిందని తెలిపారు. అమరావతి - బెల్లంకొండ రోడ్డుతో పాటు.. రాజధానికి డబుల్ లేన్ రోడ్డు వేస్తున్నామన్నారు. పెదమద్దూరు బ్రిడ్జి కూడా పూర్తి చేస్తున్నామన్నారు. అమరావతిలో ఆస్పత్రులు బాగు చేశామని.. రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చామని చెప్పారు. ప్రజల్లో వస్తున్న ఆదరణ చూస్తుంటే మళ్లీ 2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయన్న నమ్మకం ఉందన్నారు. ప్రచారంలో ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేని ఆప్యాయంగా పలకరిస్తూ.. ఆత్మీయంగా ఆలింగనాలు చేసుకోవడం విశేషం. అన్నా మాకు మళ్లీ నువ్వే గెలవాలి.. ఎమ్మెల్యేగా రావాలి అంటూ యువకులు చెప్పడం జరిగింది.


Gopi

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2025. All right Reserved.

Developed By :