Thursday, 16 April 2026 10:20:14 PM
# పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్

అన్నా మేమంతా మీ వెంటే.. మాకు మంచి చేసింది నువ్వే..

Date : 11 May 2024 10:23 AM Views : 1381

VM Today News - రాజకీయం / పల్నాడు : మునగోడు, తురగావారిపలెంలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకి జననీరాజనం అన్నా మీ పాలనలోనే మాకు మంచి జరిగింది. సంక్షేమ పథకాలతో మా బతుకులు బాగుపడ్డాయి.. మేమంతా మీ వెంటే.. అమరావతి ఎస్సీ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకి జనం చెప్పిన మాటలు ఇవి. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమరావతి మండలం మునగోడు, తురగావారిపాలెం గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకి స్థానికులు నీరాజనం పలికారు. పూలతో స్వాగతం పలికి.. హారతులు పట్టారు. ఓట్లు వేయాలని ఎమ్మెల్యే అడగకముందే.. వారంతా.. తమకు జగనన్న పాలనలో మంచి జరిగిందని.. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాయని తెలిపారు. తమ జీవితాలు బాగుచేసిన జగనన్నకే తమ ఓటు అని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో పెదకూరపాడు నియోజకవర్గాన్ని తాను ఎంతో అభివృద్ధి చేశానని.. 30 ఏళ్లలో జరగని అభివృద్ధి.. గత ఐదేళ్లో జరిగిందని తెలిపారు. అమరావతి - బెల్లంకొండ రోడ్డుతో పాటు.. రాజధానికి డబుల్ లేన్ రోడ్డు వేస్తున్నామన్నారు. పెదమద్దూరు బ్రిడ్జి కూడా పూర్తి చేస్తున్నామన్నారు. అమరావతిలో ఆస్పత్రులు బాగు చేశామని.. రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చామని చెప్పారు. ప్రజల్లో వస్తున్న ఆదరణ చూస్తుంటే మళ్లీ 2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయన్న నమ్మకం ఉందన్నారు. ప్రచారంలో ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేని ఆప్యాయంగా పలకరిస్తూ.. ఆత్మీయంగా ఆలింగనాలు చేసుకోవడం విశేషం. అన్నా మాకు మళ్లీ నువ్వే గెలవాలి.. ఎమ్మెల్యేగా రావాలి అంటూ యువకులు చెప్పడం జరిగింది.


Gopi

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :