VM Today News - వార్తలు / ప్రకాశం : ఆంధ్రప్రదేశ్ 108 అంబులెన్స్ సర్వీస్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం జీతాల పెంపు ప్రకటించింది. ఈఎంటీలు, పైలెట్లకు నెలకు రూ.2,000 అదనంగా పెంచాలని నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న జీతానికి ఈ పెంపు వర్తింపజేశారు. 5 మరియు 10 సంవత్సరాల సేవ పూర్తిచేసిన వారికి ఆటోమేటిక్ స్లాబ్ అప్గ్రేడేషన్ అమలు చేయనున్నారు. దీంతో ఉద్యోగులకు ఆర్థికంగా మరింత లాభం కలగనుంది. ఈ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా 108 సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల నుంచే పెరిగిన జీతాలు చేతికి అందుతున్నాయి. ఏపీ 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపారు. “THANK YOU CM SIR” అంటూ పాంప్లెట్లు ప్రదర్శించారు. “THANK YOU BHAVYA HEALTH SERVICES PRIVATE LIMITED” అని కూడా పేర్కొన్నారు. విధులు నిర్వహిస్తున్న అంబులెన్స్ వాహనాల ముందు పాంప్లెట్లు ఉంచారు. ప్రభుత్వానికి, భవ్య కంపెనీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఇకపై మరింత మెరుగైన సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. త్రిపురాంతకం 108 సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా యూనియన్ నాయకులు వెన్న గాలి రెడ్డి, ఈఎంటి ఆదినారాయణ, పైలెట్ దూపాటి శ్రీను హాజరయ్యారు.
Reporter
VMToday News