Monday, 02 March 2026 04:22:08 PM
# నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

“థ్యాంక్యూ సీఎం సర్” పాంప్లెట్‌లతో 108 సిబ్బంది ధన్యవాదాలు

Date : 13 February 2026 04:40 PM Views : 42

VM Today News - వార్తలు / ప్రకాశం : ఆంధ్రప్రదేశ్ 108 అంబులెన్స్ సర్వీస్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం జీతాల పెంపు ప్రకటించింది. ఈఎంటీలు, పైలెట్లకు నెలకు రూ.2,000 అదనంగా పెంచాలని నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న జీతానికి ఈ పెంపు వర్తింపజేశారు. 5 మరియు 10 సంవత్సరాల సేవ పూర్తిచేసిన వారికి ఆటోమేటిక్ స్లాబ్ అప్‌గ్రేడేషన్ అమలు చేయనున్నారు. దీంతో ఉద్యోగులకు ఆర్థికంగా మరింత లాభం కలగనుంది. ఈ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా 108 సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల నుంచే పెరిగిన జీతాలు చేతికి అందుతున్నాయి. ఏపీ 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపారు. “THANK YOU CM SIR” అంటూ పాంప్లెట్‌లు ప్రదర్శించారు. “THANK YOU BHAVYA HEALTH SERVICES PRIVATE LIMITED” అని కూడా పేర్కొన్నారు. విధులు నిర్వహిస్తున్న అంబులెన్స్ వాహనాల ముందు పాంప్లెట్‌లు ఉంచారు. ప్రభుత్వానికి, భవ్య కంపెనీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఇకపై మరింత మెరుగైన సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. త్రిపురాంతకం 108 సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా యూనియన్ నాయకులు వెన్న గాలి రెడ్డి, ఈఎంటి ఆదినారాయణ, పైలెట్ దూపాటి శ్రీను హాజరయ్యారు.


M kannaiah

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :