VM Today News - వార్తలు / పల్నాడు : పల్నాడు జిల్లా బీజేపీ జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణంలోని కార్యాలయంలో మన్ కీ బాత్ వాల్ పోస్టర్ ను పల్నాడు జిల్లా మన్ కీ బాత్ కన్వీనర్ కో కన్వీనర్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు జిల్లా ఉపాధ్యక్షుడు ఇతడి కిరణ్ హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన జరగబోయే ప్రధాని మంత్రి మోదీ మనసులో మాట వినండి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఇందులో భాగంగా ప్రతి కాలేజీలో క్యాంప్ ప్రోగ్రాం నిర్వహించి అందులో ఎంపికైన విద్యార్థులను దేశంలోని జేఎన్ యూ జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఢిల్లీ యూనివర్సిటీ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఢిల్లీ ఐఐటీ ఎన్ఐటీ భోపాల్ ఎయిమ్స్ ఢిల్లీ పార్లమెంట్ సందర్శన సంసత్ భవన్ డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ జ్ఞాపక భూమి వంటి ప్రముఖ విద్యాసంస్థలకు సందర్శనకు తీసుకెళ్తామని వెల్లడించారు అక్కడ విద్యార్థులు ఉన్నత విద్యా అవకాశాలు విధానాలపై అవగాహన పెంపొందించుకుంటారని చెప్పారు ప్రతి విద్యార్థి ఆ క్యాంప్ లో పాల్గొని తన ఆలోచనలు పంచుకోవాలని సూచించారు క్యాంప్ లో గెలుపొందిన వారిని యూనివర్సిటీలకు తీసుకెళ్తామని తెలిపారు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించే విధంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు
Reporter
VMToday News