VM Today News - వార్తలు / పల్నాడు : వినుకొండ పట్టణంలో గురువారం కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు వెళ్తున్న 7వ తరగతి విద్యార్థిని చేతిపై గుర్తు తెలియని వ్యక్తి సూదితో గుచ్చాడు. ద్విచక్ర వాహనంపై మాస్కులు ధరించి వచ్చిన ఇద్దరు యువకుల్లో ఒకరు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. విద్యార్థిని పాఠశాలకు చేరుకున్న తర్వాత మైకం, చేతి నొప్పి ఉందని తెలిపింది. దీనితో పాఠశాల సిబ్బంది వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బాలిక చేతిపై సూది గుచ్చిన ఆనవాళ్లు ఉన్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోందని తెలిపారు. అవసరమైతే మరిన్ని పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు చెప్పారు. బాలిక ప్రాణాలకు ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.
Reporter
VMToday News