Saturday, 13 June 2026 10:03:42 AM
# నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

ఆటో బోల్తా ప్రయాణికులకు గాయాలు

Date : 14 February 2026 07:49 PM Views : 154

VM Today News - వార్తలు / ప్రకాశం : వినుకొండ పట్టణంలోని ముళ్లమూరు బస్టాండ్ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఆటో టైర్ ఒక్కసారిగా ఊడిపోవడంతో వాహనం అదుపుతప్పి రోడ్డుపై తిరగబడింది. ప్రమాద సమయంలో ఆటోలో పలువురు ప్రయాణికులు ఉండటంతో పలువురు గాయపడ్డారు. నరగాయపాలెం గ్రామానికి చెందిన నాలుగు నెలల గర్భిణీ శిరీష తీవ్రంగా గాయపడింది. ఆటోలో ఉన్న ముగ్గురు చిన్నారులు, మరో ఇద్దరు వ్యక్తులు కూడా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని బయటకు తీసి ప్రాథమిక చికిత్స అందించారు. తరువాత వారిని వినుకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు గాయపడిన వారికి చికిత్స అందిస్తూ గర్భిణీ పరిస్థితిని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి టైర్ ఊడిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదంతో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం కలగగా, పోలీసులు రాకపోకలను సవ్యంగా మళ్లించారు.


M kannaiah

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :