VM Today News - వార్తలు / పల్నాడు : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం వినుకొండ ఆర్టీసీ డిపో నుంచి ఈ నెల 15వ తేదీ ఆదివారం తెల్లవారుజాము నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ నాగేశ్వరరావు తెలిపారు. శ్రీశైలం (10), కోటప్పకొండకు కిందకు మాత్రమే (50), త్రిపురాంతకం (6), మన్నేపల్లి తండా (4) సర్వీసులు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ మేరకు అదనపు బస్సులు కూడా నడుపుతారు. పట్టణంలో 3 సమాచారం కేంద్రాలు, క్షేత్రాల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Reporter
VMToday News