VM Today News - వార్తలు / పల్నాడు : వినుకొండలోని డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో డీవార్మింగ్ డే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ప్రారంభించారు. జిల్లాలో 1 నుంచి 19 ఏళ్ల వయస్సు గల బాలబాలికలకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. నులిపురుగులు పిల్లలను శక్తిహీనులుగా మార్చి రక్తహీనతకు గురిచేస్తాయని కలెక్టర్ తెలిపారు. చిన్నారులు మట్టిలో ఆడుకోవడం, చేతులు శుభ్రం చేసుకోకపోవడం వల్ల పురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయని చెప్పారు. 50 శాతానికి పైగా చిన్నారులు నులిపురుగుల సమస్యతో బాధపడుతున్నారని గణాంకాలు సూచిస్తున్నాయని పేర్కొన్నారు.
Reporter
VMToday News