Tuesday, 18 February 2025 09:21:53 PM
# రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువనాయకులు కన్నా నాగరాజు # బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది # క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్ # ఆర్యవైశ్యులకు అండగా నిలిచే డా౹౹చదలవాడ అరవింద బాబుని గెలిపించుకుందాం # లోక్‌సభకు 965, అసెంబ్లీకి 5,460 నామినేషన్లు # ఎన్నికల ప్రచారంలో మాజీ మేయర్ # సమాజమే దేవాలయమనేది మన నినాదం సమాజం ఉన్నదే దోపిడీకి అనేది వైసీపీ నినాదం వైద్యుల్ని కూడా వేధించిన దుర్మార్గుడైన జగన్ రెడ్డి,గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

బాస్ సంస్ధ ను బలోపేతం చేద్దాం - పి టి ఎం శివ ప్రసాద్

Date : 25 November 2024 10:13 PM Views : 122

VM Today News - వార్తలు / అన్నమయ్య : కార్యకర్తలు, నాయకులు అవిశ్రాంతంగా పనిచేసి భారతీయ అంబేడ్కర్ సేన (బాస్) సంస్థను బలోపేతం చేద్దామని ఆసంస్థ వ్యవస్థాపకుడు పీటీయం శివప్రసాద్ పిలుపునిచ్చారు. ఆదివారం పీలేరులోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు భారతీయ అంబేడ్కర్ సేన ముఖ్య ప్రతినిధుల సమావేశం జరిగింది. బాస్ జిల్లా కో కన్వీనర్ పాలకుంట శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి శివప్రసాద్ ముఖ్య అతిధిగా హాజరైనారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ రాబోయే డిసెంబర్ 20 నుండి జనవరి 26 వరకూ భారతీయ అంబేడ్కర్ సేన 12వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించాలని చెప్పారు. బాస్ సంస్థను బలోపేతం చేసేందుకు డిసెంబర్ 1నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 10వేలకు తగ్గకుండా సభ్యత్వాలను నమోదు చేయాలని సూచించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియలో నాయకులు చూపే చొరవను బట్టి, తదుపరి జరుగబోయే నూతన కమిటీల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు.ఫిబ్రవరి చివరి నాటికి సభ్యత్వ నమోదు, నూతన కమిటీల నిర్మాణం పూర్తి చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ పేదల సమస్యలపై ఉద్యమాన్ని ప్రారంభించడం జరుగుతుందని, కావున నాయకులు - కార్యకర్తలు తమ పనులు వేగవంతం చేసి భవిష్యత్ పోరాటాలకు ప్రజల్ని సన్నద్ధం చేయాలని శివప్రసాద్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బాస్ జిల్లా కో కన్వీనర్ పాలకుంట శ్రీనివాసులు, ప్రజాకవి పోతబోలు రెడ్డెప్ప, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు బురుజు లక్ష్మీనారాయణ, ఆరుద్ర శ్రీనివాస్, సుధాకర్, గంగరాజు లతోపాటు బాస్ జిల్లా నాయకులు ముత్యాల మోహన్, నీరుగట్టి రమణ, ముల్లంగి కృష్ణయ్య, చాట్ల బయన్న, సొన్నికంటి రెడ్డెప్ప, బురుజు రెడ్డిప్రసాద్, సూరి రాయల్, జనార్దన్, ఇర్ఫాన్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.


Gopi

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2025. All right Reserved.

Developed By :