Wednesday, 16 September 2026 04:19:53 AM
# బాల్యవివాహాలను నిర్మూలించడం సమాజ బాధ్యత- అడ్వకేట్ జిజే రావు # 15 వేల రూపాయలు పింఛన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లాకు డివిఎంసి మెంబర్ . డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ విజ్ఞప్తి # భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ సంజన సింహాకు డివిఎంసి మెంబర్ డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ విజ్ఞప్తి # సత్తెనపల్లి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ విజయకేతనంలో మరో మైలురాయి # నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం

3 వేల మంది పోలీసులతో కోటప్పకొండలో కట్టుదిట్టమైన భద్రత

అశ్లీల నృత్యాలకు నో చెప్పిన పోలీసులు

Date : 13 February 2026 05:04 PM Views : 234

VM Today News - వార్తలు / పల్నాడు : మహాశివరాత్రి సందర్భంగా జరిగే కోటప్పకొండ తిరునాళ్లుకు విస్తృత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు తెలిపారు. రాష్ట్ర పండుగ హోదా కలిగిన ఈ తిరునాళ్లకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ నుండి కూడా భక్తులు భారీగా తరలివస్తారని పేర్కొన్నారు. ట్రాఫిక్ రద్దీ నివారించేందుకు ప్రత్యేక డైవర్షన్లు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. నరసరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట వైపుల నుంచి వచ్చే వాహనాలకు వేర్వేరు పార్కింగ్ ప్రదేశాలు కేటాయించారు. కొండపైకి ద్విచక్ర వాహనాలు, కార్లు అనుమతించరని స్పష్టం చేశారు. టోల్‌గేట్ వద్ద నుంచి షటిల్ బస్సుల ద్వారానే భక్తులను కొండపైకి తరలించనున్నారు. ప్రభల రాకపోకలకు ప్రత్యేక మార్గాలు సూచించి, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభల నిర్వాహకులను బైండోవర్ చేసినట్లు తెలిపారు. అశ్లీల నృత్యాలకు అవకాశం లేకుండా ఆర్కెస్ట్రా బృందాలపై కూడా నిఘా ఉంచారు. దొంగతనాలు, వేధింపులు నివారించేందుకు మఫ్టీ సిబ్బందిని నియమించారు. స్నానాల ఘాట్, మెట్ల మార్గంలో పటిష్ట భద్రత కల్పించారు. 200 సీసీ కెమెరాలు, 30 డ్రోన్లతో నిఘా కొనసాగిస్తూ రెండు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. మొత్తం సుమారు 3,000 మంది పోలీసు సిబ్బందితో తిరునాళ్లు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు ట్రాఫిక్ నియమాలు పాటించి పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.


M kannaiah

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: