Monday, 02 March 2026 02:31:32 PM
# నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

3 వేల మంది పోలీసులతో కోటప్పకొండలో కట్టుదిట్టమైన భద్రత

అశ్లీల నృత్యాలకు నో చెప్పిన పోలీసులు

Date : 13 February 2026 05:04 PM Views : 48

VM Today News - వార్తలు / పల్నాడు : మహాశివరాత్రి సందర్భంగా జరిగే కోటప్పకొండ తిరునాళ్లుకు విస్తృత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు తెలిపారు. రాష్ట్ర పండుగ హోదా కలిగిన ఈ తిరునాళ్లకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ నుండి కూడా భక్తులు భారీగా తరలివస్తారని పేర్కొన్నారు. ట్రాఫిక్ రద్దీ నివారించేందుకు ప్రత్యేక డైవర్షన్లు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. నరసరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట వైపుల నుంచి వచ్చే వాహనాలకు వేర్వేరు పార్కింగ్ ప్రదేశాలు కేటాయించారు. కొండపైకి ద్విచక్ర వాహనాలు, కార్లు అనుమతించరని స్పష్టం చేశారు. టోల్‌గేట్ వద్ద నుంచి షటిల్ బస్సుల ద్వారానే భక్తులను కొండపైకి తరలించనున్నారు. ప్రభల రాకపోకలకు ప్రత్యేక మార్గాలు సూచించి, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభల నిర్వాహకులను బైండోవర్ చేసినట్లు తెలిపారు. అశ్లీల నృత్యాలకు అవకాశం లేకుండా ఆర్కెస్ట్రా బృందాలపై కూడా నిఘా ఉంచారు. దొంగతనాలు, వేధింపులు నివారించేందుకు మఫ్టీ సిబ్బందిని నియమించారు. స్నానాల ఘాట్, మెట్ల మార్గంలో పటిష్ట భద్రత కల్పించారు. 200 సీసీ కెమెరాలు, 30 డ్రోన్లతో నిఘా కొనసాగిస్తూ రెండు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. మొత్తం సుమారు 3,000 మంది పోలీసు సిబ్బందితో తిరునాళ్లు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు ట్రాఫిక్ నియమాలు పాటించి పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.


M kannaiah

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :